Chad: చాద్లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
60 killed in anti-government protests in Chad: చాద్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు మిన్నంటుతున్నాయి. వీటిని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డేబీ తన అధికారాన్ని రెండేళ్ల పాటు పొడగించుకోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం దేశంలోని రెండు అతిపెద్ద నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఎగిసిపడ్డాయి. చాద్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో 60 మంది మరణించారు.
Read Also: Langer Houz Crime: బాత్రూమ్ లో పేలిన గీజర్… ఇద్దరు డాక్టర్లు మృతి
Also Read
- Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ఫ్రాన్స్ తో పాటు ఇతర ఆఫ్రికన్ యూనియన్ దేశాలు చాద్ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఆమ్నేస్టి ఇంటర్నేషనల్, నిరసనకారులపై ప్రభుత్వం అణిచివేతను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేసింది. చట్టవిరుద్ధంగా హత్యలు చేసి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాని ప్రభుత్వాన్ని కోరింది. రాజధాని ఎన్ జమెనాలో 30 మంది మరణించినట్లు చాడ్ ప్రభుత్వం అధికార ప్రతినిధి అజీజ్ మహమత్ సలే తెలిపారు. అయితే నిరసన కారులు మాత్రం 40 మంది చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అనేక మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయని అన్నారు. చాద్ లో రెండో పెద్ద నగరం అయిన మౌండౌలో మరో 32 మంది నిరసనకారులు ప్రభుత్వ కాల్పుల్లో మరణించారు. దక్షిణ చాద్ లోని దోబా, సర్హ్ పట్టణాలకు కూడా నిరసనలు పాకాయి.
18 నెలల క్రితం తండ్రి హత్య నేపథ్యంలో ఇద్రిస్ డేబీ బాధ్యతులు తీసుకున్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా ఆయన చాద్ ను పాలిస్తున్న క్రమంలో అప్పటి అధ్యక్షుడు ఇద్రిస్ డేబీ ఇట్నో ఎప్రిల్ 2021లో తిరుగుబాటుదారుల చేతిలో చనిపోయారు. ఆ తరువాత ప్రస్తుతం పాలకుడు తన పదవిని రెండేళ్లు పెంచుకోవడంతో నిరసనలు చెలరేగాయి. రాజధాని గురువారం తెల్లవారుజాము నుంచే ప్రజలు నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ దళాలతు కాల్పులు జరిపాయి. మరణించిన వారిలో చాడియన్ జర్నలిస్ట్ నార్సిస్ ఓరెడ్జే ఉన్నారు. చాద్ లో నిరసనకారులపై కాల్పులు జరపడం ఇదే తొలిసారికాదు. 2021,2022 లో జరిగిన ఘటనల్లో కూడా అక్కడి దళాలు ప్రజలపై కాల్పులు జరిపాయి.
తాజావార్తలు
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
-
Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్… “ధమాల్ 4” ట్రైలర్ మామూలుగా లేదుగా
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..