Earthquake: ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీల్లో ప్రకంపలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని కలాఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్థాన్ మరియు తుర్క్మెనిస్తాన్లలో ప్రకంపనలు సంభవించాయి.

