Egypt: ఈజిప్టు రాణి సమాధిలో 5000 ఏళ్ల నాటి వైన్ లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ. కొన్ని సమాధుల్లో లభించిన వేల ఏళ్ల నాటి తేనె ఇప్పటికీ అలాగే చెడిపోకుండా ఉంది.
తాజాగా ఈజిప్టు రాణి క్వీన్ మెరెట్-నీత్ సమాధిని కనుగొన్నారు. దాదాపుగా 5000 వేల ఏళ్ల నాటి ఈమె సమాధిలో ఆనాటి సీల్డ్ ‘వైన్’ సీసాలను కనుగొన్నారు. ఈమెను ఈజిప్టును పాలించిన మొదటి మహిళా ఫారో అని నమ్ముతారు. వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తే శాస్త్రవేత్త క్రిష్టియానా కోహ్లెర్ నేతృత్వంలోని జర్మన్-ఆస్ట్రియన్ టీం అబిడోస్ లోని క్వీన్ మెరెట్-నీత్ సమాధిని తవ్వుతుండగా.. వారు పెద్ద జాడీల్లో వైన్ ని కనుగొన్నారు.
Also Read
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
Read Also: Kim Jong Un: కిమ్ పైశాచికం.. పిరానా చేపలకు ఆహారంగా వేసి జనరల్ హత్య..
సమాధిలో చాలా సేంద్రీయ అవశేషాలు, ద్రాక్ష విత్తనాలు, స్పటికాలను కొనుగొన్నామని, ప్రస్తుతం వాటిని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నామని పరిశోధకులు చెప్పారు. సమాధి కాంప్లెక్స్ మధ్యలో రాణి సమాధి ఉంటే.. దాని చుట్టూ సభికులు, సేవకుల ద్వితీయ సమాధులు కూడా ఉన్నాయి. ఈ పురాతన వైన్ జాడీల్లో ఇప్పటికీ కొన్ని సీల్డ్ చేయబడి ఉన్నాయి. నిజానికి మెరెట్-నీత్ రాణికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఈజిప్టులో మొదటి రాజ శ్మశానవాటిక కలిగిన ఏకైక మహిళ ఇమే.
సమాధిలో దొరికిన శాసనాల ప్రకారం 3000 BCలో ట్రెజరీ వంటి ప్రభుత్వ శాఖను నిర్వహించినట్లుగా పరిశోధకులు నిర్దారించారు. ప్రస్తుత తవ్వకాలు ఆమె జీవిత కాలం, ఇతర విషయాలను వెలుగులోకి తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమాధిలో మెరిట్-నీత్ సమాధి చుట్టూ 41 మంది సభికులు, సేవలకుల సమాధులు ఉన్నాయి. కాల్చని మట్టి ఇటుకలు, మట్టి, కలపతో నిర్మించారు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!