Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
162 Killed In Indonesia Earthquake Hundreds Injured: ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా.. జావా ద్వీపం అతలాకుతలం అయ్యింది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.6గా భూకంప తీవ్రంగా నమోదైంది. చియాంజుర్ ప్రాంతం దాదాపు ధ్వంసమైపోయింది. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో.. తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ భూకంపం కారణంగా.. ఇప్పటివరకు 162 మంది ప్రాణాలు కోల్పోయినట్టు జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారని, అందునా విద్యార్థులే అధికంగా ఉన్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. సుమారు 700 మందికి పైగా గాయాలపాలైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోవడంతో.. చాలామంది ఆరుబయటే చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చియాంజుర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని జకార్తాలోనూ దీని ప్రభావం కనిపించింది. అక్కడి అపార్ట్మెంట్లు, కార్యాలయాలు సైతం కంపించాయి. దీంతో.. ప్రజలు, ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. జావాలో సాయంత్రం వరకు.. 1.5 నుంచి 4.8 తీవ్రతతో భూమి పలుమార్లు కంపించింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో.. జావా ద్వీపం వణికిపోయింది. రాత్రి 9:16 గంటల ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. జనావాసాలు నేలమట్టం అయ్యాయి. ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 25 మంది చనిపోగా, 460 మంది గాయపడ్డారు. గతేడాది జనవరిలో సులావేసిలో భూకంప ధాటికి 100మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆస్తినష్టం కూడా భారీగానే జరిగింది.
Also Read
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
తాజావార్తలు
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!