Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
162 Killed In Indonesia Earthquake Hundreds Injured: ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా.. జావా ద్వీపం అతలాకుతలం అయ్యింది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.6గా భూకంప తీవ్రంగా నమోదైంది. చియాంజుర్ ప్రాంతం దాదాపు ధ్వంసమైపోయింది. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో.. తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ భూకంపం కారణంగా.. ఇప్పటివరకు 162 మంది ప్రాణాలు కోల్పోయినట్టు జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారని, అందునా విద్యార్థులే అధికంగా ఉన్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. సుమారు 700 మందికి పైగా గాయాలపాలైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోవడంతో.. చాలామంది ఆరుబయటే చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చియాంజుర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని జకార్తాలోనూ దీని ప్రభావం కనిపించింది. అక్కడి అపార్ట్మెంట్లు, కార్యాలయాలు సైతం కంపించాయి. దీంతో.. ప్రజలు, ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. జావాలో సాయంత్రం వరకు.. 1.5 నుంచి 4.8 తీవ్రతతో భూమి పలుమార్లు కంపించింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో.. జావా ద్వీపం వణికిపోయింది. రాత్రి 9:16 గంటల ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. జనావాసాలు నేలమట్టం అయ్యాయి. ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 25 మంది చనిపోగా, 460 మంది గాయపడ్డారు. గతేడాది జనవరిలో సులావేసిలో భూకంప ధాటికి 100మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆస్తినష్టం కూడా భారీగానే జరిగింది.
Also Read
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
తాజావార్తలు
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?