తాలిబన్ల చెరలో వెయ్యిమంది భారతీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడి భారత రాయభార కార్యాలయంలోని మొత్తం సిబ్బందిని భారత్కు తరలించారు అధికారులు.. అయితే, ఆఫ్ఘనిస్థాన్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది… సుమారు 1000 మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.. వారిలో సుమారు 200 మంది సిక్కులు, హిందువులు స్థానిక గురుద్వారలో తలదాచుకున్నట్లు సమాచారం. ఆప్ఘన్ లో ఉన్న భారతీయులతో సహా, తాలిబాన్ల చేతిలో బందీలుగా ఉన్న సుమారు 150 మంది భారతీయులను భారత్ కు తరలించేందుకు, ఇతర మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు భారత విదేశాంగశాఖ ఉన్నతాధికారులు. ప్రస్తుతానికి తాలిబాన్ల వద్ద బందీలుగా ఉన్న భారతీయులకు ఏలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.
తాలిబాన్ల బందీలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారని.. సాధ్యమైనంత త్వరలో భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెబుతున్నారు.. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం లో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది.. కాబూల్ విమానాశ్రయం వద్ద సుమారు 150 మంది భారతీయతలను బందీలుగా చేసిన తాలిబాన్లు.. విమానాశ్రయం నుంచి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు ట్రక్కులలో తరలించినట్టుగా సమాచారం.. భారతీయులకు సంబంధించిన ప్రయాణ పత్రాలు, గుర్తింపు కార్డులను పరిశీలించినట్టుగా తెలుస్తోంది.. ఇంకా సుమారు 1000 మంది ఆప్ఘనిస్తాన్ లో భారతీయులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.. అయితే, చాలామంది భారత దౌత్యకార్యలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోని భారతీయులు కూడా వీరిలో ఉన్నారు.. ఏఏ ప్రాంతాలలో ఉంటున్నారో, ఆయా ప్రాంతాలు సురిక్షితమే నా లేదా అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడిపోయారు అధికారులు.
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!