MH370 Plane: తప్పిపోయిన మలేషియా విమానం కోసం మళ్లీ సెర్చింగ్.. 10 ఏళ్లలో ఏం తేలింది..?
- MH370 విమానం కోసం మళ్లీ సెర్చ్ ఆపరేషన్..
- 10 ఏళ్ల క్రితం మిస్సయిన మలేషియా విమానం..
- వైమానిక రంగంలో ఇప్పటికీ అంతు తేలని రహస్యం..
- వేల మైళ్ల సముద్రాన్ని జల్లెడ పట్టిన క్రాష్ సైట్ గుర్తించలేని పరిశోధకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MH370 Plane: 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మలేషియా విమానం MH370, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అత్యాధునిక సాంకేతికత, సముద్రంలో వేల మైళ్లను జల్లెడ పట్టినా కూడా ఒక్క శకలం కూడా లభించలేదు. అసలు ఈ విమానానికి ఏమైదనే విషయాన్ని ఇప్పటి వరకు ఇన్వెస్టిగేటర్లు కనిపెట్టలేకపోయారు. మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కి 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైంది. ఇప్పటివరకు ఈ MH370 విమానం అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే, ఈ విమానం కోసం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ మొదలుకాబోతోంది. శాటిలైట్ డేటా విశ్లేషనలో విమానం పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఎక్కడో కూలిపోయిం ఉంటుందని తేలింది. అయినప్పటికీ, రెండు ప్రధాన శోధనలు ముఖ్యమైన అణ్వేషణతో ముందుకు రావడంలో విఫలమయ్యాయి.
Also Read
- Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ఇప్పటి వరకు ఏం తెలుసు.?
కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాల తర్వాత విమానం నుంచి చివరిసారిగా ట్రాన్స్మిషన్ జరిగింది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా “గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో”తో సైన్ ఆఫ్ చేసాడు. అదే సమయంలో విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొంత సమయం తర్వాత దాని ట్రాన్పాండర్ ఆఫ్ చేయబడింది. దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు.
మిలిటరీ రాడార్ ప్రకారం.. విమానం తన మార్గం నుంచి తప్పినట్లు తెలుస్తోంది. మలేషియా, పెనాంగ్ ద్వీపం మీదుగా ఇండోనేషియా సుమత్రా ద్వీపం కొనలో ఉన్న అండమాన్ సముద్రంలోకి వెళ్లినట్లు చూపించింది. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి అన్ని సంబంధాలను కోల్పోయింది.
పరిశోధనలు:
మలేషియా, ఆస్ట్రేలియా, చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోని 120,000 చదరపు కి.మీ (46,332 చదరపు మైళ్ళు) ప్రాంతంలో ఇన్మార్శాట్ ఉపగ్రహం, విమానం మధ్య ఆటోమేటిక్ కనెక్షన్ డేటా ఆధారంగా నీటి అడుగున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపుగా 143 మిలియన్ డాలర్లను విమాన శోధన కోసం ఖర్చు చేశారు. విమానం జాడ తెలియకపోవడంతో జనవరి 2017లో సెర్చింగ్ నిలిపేశారు.
2018లో మలేషియా యూఎస్ అన్వేషణ సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ మధ్య మూడు నెలల వెతుకులాట కోసం ‘‘నో క్యూర్, నో ఫీ’’ఆఫర్ కుదిరింది. విమానం దొరికితేనే కంపెనీకి డబ్బు వస్తుంది. ఈ శోధనలో అసలు టార్గెటెడ్ స్థలానికి ఉత్తరంగా 112,000 చ.కి.మీ (43,243 చదరపు మైళ్ళు) విస్తరించింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో కూడా విమానం ఆనవాళ్లు కనిపించలేదు.
శిథిలాలు లభ్యం:
ఆఫ్రికా తీరం వెంబడి, హిందూ మహాసముద్రంలోని ద్వీపాలలో 30 కంటే ఎక్కువ అనుమానిత విమాన శకలాలు దొరికాయి. కేవలం ఇందులో మూడు రెక్కల శకలాలు మాత్రమే MH370కి చెందినవిగా నిర్ధారించబడ్డాయి. డ్రిఫ్ట్ నమూనా విశ్లేషణ ద్వారా విమానం ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించాలని అనుకున్నారు.
దర్యాప్తు ఏం చెబుతోంది:
MH370 అదృశ్యంపై 495 పేజీల నివేదిక, జూలై 2018లో ప్రచురించబడింది. బోయింగ్ 777 కంట్రోల్స్ ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయబడి ఉండొచ్చని, అయితే దీనికి బాధ్యులెవరనే దాన్ని గుర్తించలేకపోయారు. కౌలాలంపూర్ మరియు హో చి మిన్ సిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లు చేసిన తప్పులను కూడా నివేదిక హైలైట్ చేసింది. అసలు MH370 విమానానికి ఏం జరిగిందనే దానిని ఎవరు కనిపెట్టలేకపోయారు.
Read Also:Strange Thief: అదేం ఆనందమో..! మహిళల జాకెట్లు మాయం చేస్తున్న దొంగ..
కుట్ర సిద్ధాంతాలు:
MH370 విమాన క్రాష్ సైట్ని గుర్తించలేకపోవడం, యాంత్రిక లోపం లేదా రిమోట్ కంట్రోల్డ్ క్రాష్, గ్రహాంతవాసుల అపహరణ, రష్యా కుట్ర కోణం ఇలా అనేక కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది.
మళ్లీ సెర్చింగ్ ప్రారంభం:
ఓషన్ ఇన్ఫినిటీ నుండి వచ్చిన కొత్త ప్రతిపాదనను అనుసరించి శిథిలాల కోసం అన్వేషణను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మలేషియా రవాణా మంత్రి శుక్రవారం ప్రకటించారు, ఇది గణనీయమైన శిధిలాలు కనుగొనబడితే $70 మిలియన్లను అందజేస్తుంది.కొత్త సెర్చ్, ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, మునుపటి శోధన ప్రాంతాన్ని 15,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని మంత్రి చెప్పారు. ఈ ఒప్పందం 18 నెలల కాలవ్యవధిని కలిగి ఉంటుంది. జవవరి, ఏప్రిల్ మధ్య సెర్చింగ్ కి ఉత్తమ సమయం అని సంస్థ సూచించింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!