Singapore: ఈ దేశం చాలా చిన్నది.. కానీ పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
- చిన్న దేశం సింగపూర్
- పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
- భారత్ కంటే.. 17 రెట్లు జనసాంద్రత ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక జనాభా మన దేశ అభివృద్ధి మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా పరిగణించబడుతుంది. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.! చైనాను కూడా మనం దాటొచ్చామని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో జనసాంద్రత కిలోమీటరుకు 488. అధిక జనాభా కారణంగా ప్రభుత్వం ప్రతి పౌరుని అవసరాలను తీర్చలేకపోతుందని విధాన నిర్ణేతలలో పెద్ద భాగం విశ్వసిస్తున్నారు. కానీ.. మన కంటే 17 రెట్లు ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశం యొక్క కథను చూద్దాం… ఇక్కడ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 8,332 మంది నివసిస్తున్నారు. కానీ.. సంపద విషయంలో మాత్రం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.
READ MORE: Paralympics 2024: భారత్కు పతకాల పంట.. మురుగేశన్కు రజతం, మనీషాకు కాంస్యం
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
అక్కడ పౌరుడి తలసరి ఆదాయం దాదాపు లక్ష అమెరికన్ డాలర్లు అంటే ఏటా దాదాపు రూ.84 లక్షలు. ఆ దేశం అందరికీ సుపరిచితమే.. అదే చిన్న దేశమై సింగపూర్. మన దేశంలో తలసరి ఆదాయం ఏడాదికి 8 వేల డాలర్లు. అంటే రూపాయి లెక్కన దాదాపు ఏడు లక్షల రూపాయలు. ఈ రోజు ఆగ్నేయాసియాలో సింగపూర్ ముఖ్యమైన దేశం. ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మరోసారి సింగపూర్లో పర్యటించనున్నారు. మొత్తం 700 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ దేశ జనాభా కేవలం 56 లక్షలు. కానీ, సంపద విషయంలో మాత్రం ఈ దేశం ప్రపంచానికి దర్పణం. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2015లో ప్రధాని మోడీ సింగపూర్లో పర్యటించారు. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, భారతదేశం ఆగ్నేయాసియా దేశాలతో తన సంబంధాలను నిరంతరం బలోపేతం చేస్తోంది.
READ MORE: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
చిన్న దేశం కానీ పెద్ద పనిజజ
భారతదేశం-సింగపూర్ మధ్య చాలా మంచి సంబంధం ఉంది. ఇరు దేశాల మధ్య పలు వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. సింగపూర్ ప్రపంచ పటంలో కనుగొనడం కష్టంగా ఉన్న దేశం. కానీ, నేడు ఇది ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలకు కేంద్రంగా మారింది. భారతదేశంతో పోలిస్తే ఈ దేశం చాలా చిన్నది. అతి తక్కువ కాలంలోనే తన అభివృద్ధి కథను రాసుకుంది. ఇంత చిన్న దేశమైనప్పటికీ, సింగపూర్ నేడు భారతదేశానికి ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుంచి భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. ఈ మొత్తం 11.77 బిలియన్ డాలర్లు. ప్రధాని మోడీ సింగపూర్ పర్యటన సందర్భంగా సెమీకండక్టర్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారతదేశం తన సెమీకండక్టర్ పరిశ్రమలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. తన పర్యటన సందర్భంగా అక్కడి సీఈవోలందరితో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!