Singapore: ఈ దేశం చాలా చిన్నది.. కానీ పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
- చిన్న దేశం సింగపూర్
- పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
- భారత్ కంటే.. 17 రెట్లు జనసాంద్రత ఎక్కువ
అధిక జనాభా మన దేశ అభివృద్ధి మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా పరిగణించబడుతుంది. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.! చైనాను కూడా మనం దాటొచ్చామని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో జనసాంద్రత కిలోమీటరుకు 488. అధిక జనాభా కారణంగా ప్రభుత్వం ప్రతి పౌరుని అవసరాలను తీర్చలేకపోతుందని విధాన నిర్ణేతలలో పెద్ద భాగం విశ్వసిస్తున్నారు. కానీ.. మన కంటే 17 రెట్లు ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశం యొక్క కథను చూద్దాం… ఇక్కడ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 8,332 మంది నివసిస్తున్నారు. కానీ.. సంపద విషయంలో మాత్రం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.
READ MORE: Paralympics 2024: భారత్కు పతకాల పంట.. మురుగేశన్కు రజతం, మనీషాకు కాంస్యం
Also Read
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
- Budget 2026: గ్లోబల్ అనిశ్చితుల్లో భారత్ బడ్జెట్పై అంచనాలు.. కీలక రంగాల్లో సంస్కరణలు
- Dollar vs Rupee: అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ.. అసలేం జరుగుతుంది..?
అక్కడ పౌరుడి తలసరి ఆదాయం దాదాపు లక్ష అమెరికన్ డాలర్లు అంటే ఏటా దాదాపు రూ.84 లక్షలు. ఆ దేశం అందరికీ సుపరిచితమే.. అదే చిన్న దేశమై సింగపూర్. మన దేశంలో తలసరి ఆదాయం ఏడాదికి 8 వేల డాలర్లు. అంటే రూపాయి లెక్కన దాదాపు ఏడు లక్షల రూపాయలు. ఈ రోజు ఆగ్నేయాసియాలో సింగపూర్ ముఖ్యమైన దేశం. ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మరోసారి సింగపూర్లో పర్యటించనున్నారు. మొత్తం 700 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ దేశ జనాభా కేవలం 56 లక్షలు. కానీ, సంపద విషయంలో మాత్రం ఈ దేశం ప్రపంచానికి దర్పణం. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2015లో ప్రధాని మోడీ సింగపూర్లో పర్యటించారు. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, భారతదేశం ఆగ్నేయాసియా దేశాలతో తన సంబంధాలను నిరంతరం బలోపేతం చేస్తోంది.
READ MORE: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
చిన్న దేశం కానీ పెద్ద పనిజజ
భారతదేశం-సింగపూర్ మధ్య చాలా మంచి సంబంధం ఉంది. ఇరు దేశాల మధ్య పలు వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. సింగపూర్ ప్రపంచ పటంలో కనుగొనడం కష్టంగా ఉన్న దేశం. కానీ, నేడు ఇది ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలకు కేంద్రంగా మారింది. భారతదేశంతో పోలిస్తే ఈ దేశం చాలా చిన్నది. అతి తక్కువ కాలంలోనే తన అభివృద్ధి కథను రాసుకుంది. ఇంత చిన్న దేశమైనప్పటికీ, సింగపూర్ నేడు భారతదేశానికి ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుంచి భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. ఈ మొత్తం 11.77 బిలియన్ డాలర్లు. ప్రధాని మోడీ సింగపూర్ పర్యటన సందర్భంగా సెమీకండక్టర్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారతదేశం తన సెమీకండక్టర్ పరిశ్రమలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. తన పర్యటన సందర్భంగా అక్కడి సీఈవోలందరితో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!