దేశంలో పుత్తడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ.50 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, వెండి మాత్రం కొంతమేర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి 76,600కి చేరింది.
స్థిరంగా బంగారం ధరలు…వెండి మాత్రం…
