Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
- ఖరీఫ్ సీజన్కు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి
- CMR డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలన్న మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ 2025–26 సీజన్కు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో స్పష్టం చేశారు.
రబీ 2024–25 సీజన్కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికిన బియ్యం (పార్బాయిల్డ్ రైస్) కేటాయించాలని కోరారు. అలాగే ఇప్పటికీ 15.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం CMR (కస్టమ్ మిల్ల్డ్ రైస్)గా పెండింగ్లో ఉన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఖరీఫ్ 2024–25 సీజన్కు సంబంధించిన CMR డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తెలిపారు.
Also Read
ప్రస్తుతం మిల్లర్ల వద్ద 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి నిల్వలు ఉన్నాయని, రైలు రేకుల కొరత కారణంగా మొత్తం 13.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు పేరుకుపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల ధాన్యం తరలింపు తీవ్రంగా ప్రభావితమవుతోందని వివరించారు.అలాగే ఖరీఫ్ 2025–26 సీజన్కు వరి కొనుగోలు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 36 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రాకుండా వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమే ఉండగా, అదనంగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు మరియు సైలోలు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆర్థిక అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని లేఖలో కోరారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!