Yerragadda: కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలి: మంత్రి పొన్నం
- కార్యకర్తలకు దిశానిర్థేశం చేసిన మంత్రి పొన్నం
- ఎర్రగడ్డ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద CC రోడ్లు వేయడం & నటరాజ్ నగర్, బంజారా నగర్, కమ్యూనిటీ హాల్ల పునరుద్ధరణ కు శంకుస్థాపన పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బెగ్ ఖాద్రి ,మీర్జా రియాజ్ హాల్ హాసన్ ఎఫండీ, కౌసర్ మొహినుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ ,
కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ,నవీన్ యాదవ్, అజారుద్దీన్,జోనల్ కమిషనర్ హేమంత్ ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
Also Read: Hyderabad: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ
ఎర్రగడ్డ డివిజన్ లో 2.16 లక్షల రూపాయల తో సీసీ రోడ్లకు & కమ్యూనిటీ శంకుస్ధాపన చేశామని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. 54 లక్షల రూపాయలతో మురుగు నీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసుకున్నాం. పక్కన ఉన్న స్థలం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నాం..రేపటి నుండి పనులు ప్రారంభం అవుతాయని.. వాకింగ్ ట్రాక్ ,పిల్లల గేమ్స్ తదితర ఏర్పాటు చేస్తారు..అధికారులకు ఇప్పటికే ఆదేశించామన్నారు.
Also Read:Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కసరత్తు..
డ్రింకింగ్ వాటర్ ,శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో 60 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కి గ్యాస్ అందిస్తున్నామన్నారాయన. కొంత మంది పిల్లలను తీసుకొచ్చి సానుభూతి తో ఓట్లు అడగాలని చూస్తున్నారు..ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు. కంటోన్మెంట్ ఎన్నికల మాదిరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు సూచించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు..అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇక్కడ కూడా డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేస్తున్నామని.. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల మాదిరి పని చేస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..