కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పటికే పలు శాఖల్లో నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 232 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు..
ప్రొబేషనరీ ఆఫీసర్-205,
ప్రొబేషనరీ ఆఫీసర్(హెచ్ఆర్)-12,
ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్-15.
అర్హతలు..
పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ/ఎంఎస్డబ్ల్యూ/పీజీ/పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్మెంట్), సీఏ/సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి..
01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజనీర్కు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్కు 30 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే స్కేల్.. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000..
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పోస్టింగ్ ప్లేసులు..
బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్ద్వారా, నవీ ముంబై.
దరఖాస్తు విధానం..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.10.2023
పరీక్ష తేది: డిసెంబర్ 2023..
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ ను సందర్శించగలరు…