NTV Telugu Site icon

Medak Crime: వీడు అసలు మనిషేనా..? పండు ముసలిపై అఘాయిత్యం.. ఆపై గొంతు నులిమి హత్య..

Crime

Crime

Medak Crime: కామంతో కళ్లుచూసుకుపోయిన కామాంధులు.. చిన్నా చితక.. ముసలి ముతక అనే తేడా లేకుండా.. త వాంఛను తీర్చుకుంటున్నారు.. అంతేకాదు.. వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు.. తాజాగా మెదక్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించి ఉడాయించాడు. అయితే, శివకుమార్‌ (28) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తేల్చారు.

Read Also: Waqf board Bill: వక్ఫ్ బోర్డు మాఫియా వశమైంది.. ప్రతిపక్షాలపై కేంద్రం ఆగ్రహం..

టేక్మాల్ మండలం సాలోజిపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు సంతానం.. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కూతురు సాలోజిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని జరిపించారు. అనంతరం దుర్గయ్య అంజమ్మ దంపతులు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా దైవ చింతనలో గడిపేందుకు గత 20 ఏళ్ల క్రితం సాలోజిపల్లి గ్రామా శివారులో శ్రీ దత్తాశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దుర్గయ్య గత కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూశాడు.. అయితే, దుర్గయ్య మృతి అనంతరం అంజమ్మ శ్రీ దత్తాశ్రమంలోనే ఒంటరిగా ఉంటూ తన శేష జీవితాన్ని గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే అంజమ్మ కూతురు అల్లుడు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి అంజమ్మ యోగక్షేమలపై ఆరా తీసేవారు. తమ వద్దే ఉండాలని కూతురు అల్లుడు ప్రాధేయపడిన అంజమ్మ నిరాకరించేదని అన్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్థరాత్రి అంజమ్మ అల్లుడు తన విధులు ముగించుకొని ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్న తన అత్తగారిని రోజువారీగా భోజనం ఇచ్చి పలకరించేందుకు వెళ్లిన సమయంలో అంజమ్మ స్పృహ కోల్పోయి మిగతాజీవిగా పడి ఉండడాన్ని గమనిచాడు. చీకట్లో శివకుమార్ కూడా ఉండడంతో అనుమానంతో నిలదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివకుమార్ అంజమ్మ అల్లుడుపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో అంజమ్మ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.