Live-In Partner: లివ్-ఇన్ పార్ట్నర్ని సోదరుడి సాయంతో చంపేసిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-In Partner: ఇటీవల కాలంలో సహజీవనాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఢిల్లీలో గతేడాది శ్రద్ధావాకర్ హత్య యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. దీని తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వారు హత్యలకు గురయ్యారు. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో మహిళలు చాలా వరకు బాధితులుగా ఉన్నారు. అయితే, గురుగ్రామ్లో మరో లివ్-ఇన్ హత్య చోటు చేసుకుంది. ఈ సారి మాత్రం బాధితులు ఓ యువకుడు. సోదరుడి సహాయంలో ఓ యువతి తన లివ్ ఇన్ పార్ట్నర్ని చంపేసింది.
తన జీవిత భాగస్వామిని తలపై, మెడపై పాన్తో కొట్టి కిరాతంగా హత్య చేసింది. ఈ కేసులో మహిళను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సదరు మహిళ తన సోదరుడు సాయంతో తిక్రీ గ్రామంలో హత్య చేసిందని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ అశోక్ విహార్లో నివాసం ఉంటున్న నీతు అలియాస్ నిష్(34), విక్కీ(28) గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సదరు మహిళకు వివాహమై భర్త నుంచి విడిపోయిందని, ఆమెకు 15 ఏళ్ల పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే సిరిసంపదలతో తులతూగుతుంది..
ఈ కేసులో సిటీ కోర్టు నీతూకి ఒక రోజు కస్టడీ విధించింది. మహిళ సోదరుడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి కచ్చి కాలనీలోని ఓ ఇంట్లో విక్కీ శవమై కనిపించాడు. వీక్కీని ఎవరో హత్య చేశారని అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. శనివారం సదర్ పోలీస్ స్టేషన్లో 302 (హత్య) మరియు 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇన్స్పెక్టర్ అర్జున్ దేవ్ నేతృత్వంలోని పోలీసు బృందం కేసును ఛేదించి ఆదివారం ఘటా గ్రామానికి చెందిన నీతును అరెస్టు చేసింది. ఆమె నుంచి విక్కీ మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి నీతూ, ఆమె సోదరుడు విక్కీ గదికి చేరుకున్నాడని, ఆమె సోదరుడు విక్కీ కలిసి మద్యం సేవించారని, ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగిందని నిందితురాలు నీతూ వెల్లడించింది. ఇంతలో నీతూ విక్కీపై దాడికి పాల్పడింది. విక్కీ మెడ, తలపై గట్టి కొట్టడంతో అతను మరణించాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు నీతూ, విక్కీ మొబైల్తో పారిపోయింది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!