Married Woman: భర్తతో విడాకులు.. మరొకరితో సహజీవనం.. ఇంతలో ఊహించని ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Woman: ఒక్కోసారి కొందరు ఆవేశంలో లేనిపోని నిర్ణయాలు తీసుకుంటుంటారు. సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకునే కోణంలో ఆలోచించరు. సమస్యలు తీవ్రమైనప్పుడు.. తీవ్ర ఆందోళనలో చంపడమో లేక చావడమో వంటి పనులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ వివాహిత కూడా అదే పని చేసింది. భర్తతో విడిపోయి, మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె.. ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Viral Video: మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన తల్లి.. వీడియో వైరల్!
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరుకు చెందిన శ్రీలేఖ (28) అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. దీంతో.. శ్రీలేఖ భర్తతో విడాకులు తీసుకొని, ఒంటరిగా నివసించసాగింది. ఈ క్రమంలోనే ఆమెకు దుర్గప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లు హ్యాపీగానే గడిపారు కానీ, క్రమంగా వీరి మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారు. బుధవారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.
Shamshabad: శంషాబాద్ హత్య కేసు మిస్టరీ వీడింది.. మృతి చెందిన మహిళ మంజుల..!
అప్పుడు దుర్గప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాసేపయ్యాక ఇంటికి తిరిగిరాగా.. ఇంటి తలుపులు వేసి ఉండటాన్ని గమనించాడు. డోర్ తీయమని గట్టిగా కేకలు వేశాడు. కానీ.. లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, చుట్టుపక్కల వారి సహాయంతో దుర్గప్రసాద్ తలుపులు బద్దలుకొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. శ్రీలేఖ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సమాచారం పోలీసులకు అందజేయగా.. వాళ్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, శ్రీలేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొదట భర్తతో విడాకులు, ఆ తర్వాత ప్రియుడితో మనస్పర్థలు ఏర్పడిన నేపథ్యంలో.. శ్రీలేఖ నిరాశకు గురై ఈ నిర్నయం తీసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!