NTV Telugu Site icon

Maharashtra Video: బైక్‌పై ఉండగా కొడుకుపై అగంతకుల దాడి.. తల్లి ఏం చేసిందంటే..!

Maharashtravideo

Maharashtravideo

మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: BJP: ‘‘నిర్‌మమతా బెనర్జీ’’, ఆమె విధ్వంసకురాలు.. రాజీనామాకు బీజేపీ డిమాండ్..

రోడ్డు పక్కన స్కూటర్‌పై కూర్చుని కొడుకు తల్లితో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు బైకులపై వచ్చి అమాంతంగా కత్తితో దాడి చేశారు. వెంటనే తృటిలో తప్పించుకున్నాడు. అక్కడే ఉన్న తల్లి వేగంగా స్పందించి.. రాళ్లు తీసుకుని ఎదురు దాడికి దిగింది. రాళ్లు తీసుకుని దాడి చేసింది. ఆ వెంటనే కొడుకు కూడా రాళ్లు తీసుకుని దాడి చేశాడు. కానీ అంతలోనే బైకులపై దుండగులు పరారయ్యారు. ఆదివారం మధ్యాహాం 1:30కి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు గతంలో నిందితుడితో గొడవ పడినట్లుగా చెప్పారు. ఆ కక్షతోనే దాడి చేసినట్లుగా చెప్పారు.

ఇది కూడా చదవండి: Kannappa: ‘కన్నప్ప’లో కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్‌ లుక్స్‌ రిలీజ్