NTV Telugu Site icon

Gambling: జూదంలో భార్యను తాకట్టు పెట్టిన భర్త..

Delhi

Delhi

Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ ఆరోపణ..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన కుమార్తెను దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి మహిళ అత్తామామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనికి తోడు బాధిత మహిళ భర్త జూదానికి అలవాటు పడి తరుచుగా డబ్బులు డిమాండ్ చేసే వాడు. జూదం కోసం రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒకసారి భర్తతో పాటు మహిళ ఢిల్లీకి వెళ్లింది. అక్కడ భార్యను పణంగా పెట్టి జూదం ఆడి ఓడిపోయాడు. ఇక చేసేదేం లేక ఆమెను అక్కడి వదిలేసి సొంతూరు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు ఢిల్లీలో రక్షించాడు. అయితే ఇలా ఇంటికి తీసుకువచ్చినా కూడా ఆరు నెలల క్రితం అత్తామామలు ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాధిత మహిళ ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా భావించిన మరిది ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక మహిళ ఎస్పీ అనుపమ్ సింగ్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు 9 మందిపై వరకట్న వేధింపులు, దాడి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.