Bihar: మరో ఇల్లాలు ఘాతుకం.. ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య
- మరో ఇల్లాలు ఘాతుకం
- ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య
- బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఘటన
రోజురోజుకూ భార్యాభర్తల సంబంధాలు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. పక్కదారి పట్టి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడొక చోట నారీమణులు.. తమ భాగస్వాములను హతమారుస్తూనే ఉంటున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాదను కుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్లో చోటుచేసుకుంది. కన్న కొడుకు చూస్తుండగానే భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు.
ఇది కూడా చదవండి: Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
బీహార్లోని పూర్ణియా జిల్లాకు చెందిన ఉషా దేవి(35), బాలో దాస్ (45) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలో దాస్ పంజాబ్లో కూలీగా పని చేస్తున్నాడు. అయితే ఉషా దేవి గ్రామంలో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ప్రేమికుడితో వెళ్లిపోవాలన్న ఆలోచనతో భర్తకు సంబంధించిన ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నించింది. అయితే సడన్గా భర్త గ్రామంలోకి వచ్చాడు. దీంతో భార్య బండారం బయటపడింది. ఆమెతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Tejeshwar Case: నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు.. అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా..
ఒక పదునైన ఆయుధంతో భర్త దాస్పై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. దాడి సమయంలో కుమారుడు శైలేంద్ర నిద్రలోంచి లేచాడు. రక్తం చిమ్మడంతో మెలుకువ వచ్చింది. అయితే ఎవరికైనా చెబితే నీకు ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించడంతో భయపడ్డాడు. తన తండ్రిని తల్లి చంపడం కళ్లరా చూసినట్లుగా శైలేంద్ర తెలిపాడు. అత్తకు చెప్పేందుకు ఉదయం వరకు వేచి ఉన్నట్లు బాలుడు చెప్పాడు. అనంతరం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. ప్రియుడితో పారిపోయేందుకు ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. తండ్రి హత్య.. తల్లి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
- Tags
- bihar
- Blood
- father
- Husband Kills
- mother
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!