Wife Killed Husband: కి‘లేడీ’ ఘాతుకం.. అందుకోసం భర్తనే లేపేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Her Husband And Father In Law For Property In Uttar Pradesh: భర్త కోట్ల ఆస్తిని దండుకోవడంతో పాటు ప్రియుడితో కలిసి జల్సాగా బతికేందుకు.. ఓ కిలాడీ లేడి తన భర్తని చంపేసింది. తొలుత సుపారీ ఇచ్చి భర్తని చంపించేందుకు ప్లాన్ చేసింది. అది వర్కౌట్ కాకపోవడంతో.. మోతాదుకి మించి నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. తన మామయ్యని కూడా లేపేసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
రెండేళ్ల క్రితం రిషభ్ త్రిపాఠీకి స్వప్నతో వివాహమైంది. రిషభ్ పోలీసు విభాగంలో పని చేస్తుండగా, స్వప్న ఫుడ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. కట్ చేస్తే.. స్వప్నకు రాజ్కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితోనే కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో భర్త పేరు మీదున్న కోటానుకోట్ల ఆస్తిని కూడా కాజేయాలని అనుకుంది. ఈ రెండూ దొరకాలంటే.. భర్తతో పాటు మామని అడ్డుని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఈ కిలేడీ తన మామయ్యకు మోతాదుకి మించి నిద్రమాత్రలిచ్చి హత్య చేసింది. ఆయనది సాధారణ మృతి అని అనుకోవడంతో.. స్వప్న ఈ కేసు నుంచి తప్పించుకుంది.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ఇక మిగిలింది భర్తే కాబట్టి.. అతడ్ని అంతమొందించేందుకు ఓ గ్యాంగ్కి మూడు లక్షల సుపారీ ఇచ్చింది. నవంబర్ 27వ తేదీన ఓ ఫంక్షన్ నుంచి రిషభ్ తిరిగొస్తున్నప్పుడు.. ఓ గ్యాంగ్ అతనిపై దాడి చేసింది. అయితే.. అతడు వాళ్ల నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. గాయాలపాలవ్వడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. భర్త బతికిపోయాడు కాబట్టి.. తన మామని చంపినట్టు భర్తను కూడా చంపేందుకు స్కెచ్ వేసింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్ట్ అయిన రిషభ్కి మోతాదుకి మించి నిద్రమాత్రలిచ్చింది. దీండో రెండ్రోజులకే అతని ఆరోగ్యం క్షీణించి.. మృతి చెందాడు.
పోస్టుమార్టం రిపోర్ట్లో ఓవర్డోస్ కారణంగా రిషభ్ మరణించాడని తెలియడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా.. స్వప్న బండారం బయటపడింది. కోట్ల ఆస్తి కొట్టేయడంతో పాటు ప్రియుడితో కలిసి జల్సాలు చేసేందుకు ఆమె ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. స్వప్నకి రాజ్కుమార్తో పాటు ఇంటి దగ్గరలో ఉండే కిరాణా షాప్ ఓనర్ సురేంద్రతోనూ ఎఫైర్ ఉంది. ఈ కేసును ఛేదించే క్రమంలోనే.. మామయ్యను కూడా స్వప్న చంపినట్టు పోలీసులు తేల్చారు.
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!