Wife Extramarital Affair: రెండేళ్లుగా భార్య రాసలీలలు.. స్కెచ్ వేసి, అడ్డంగా బుక్
Wife Killed Her Husband After A Week Of Marriage: కడదాకా తోడుంటానంది, ప్రతి సమస్యలోనూ పాలుపంచుకుంటానంది, ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి విడువనంది, చివరికి పెళ్లి చేసుకున్న వారం రోజుల్లోనే భర్తను హతమార్చింది. తన ప్రియుడి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడింది. చివరికి బండారం బట్టబయలు కావడంతో.. అరెస్టై, జైలుపాలైంది. కాకినాడలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి 2019 మే 15వ తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే.. ఆమెకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు ఈ పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమెకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదంటే, తన గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి.. ఆమె కుటుంబ సభ్యులు సూర్యనారాయణతో పెళ్లి చేశారు.
తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేయడంతో.. నాగలక్ష్మి తన కుటుంబసభ్యులపై కోపం పెంచుకుంది. అయితే.. ఆ కోపాన్ని తన భర్తపై చూపించింది. తన భర్త చనిపోతే.. తన వివాహేతర సంబంధానికి ఎవరూ అడ్డు రారని అనుకుంది. పెళ్లైన వారం రోజుల్లోనే.. తన ప్రియుడు రాధాకృష్ణతో కలిసి నాగలక్ష్మి ఒక పథకం వేసింది. పథకం ప్రకారం.. 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళ్దామంటూ.. పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న కత్తితో.. సూర్యనారాయణను నరికి హత్య చేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా అక్కడి నుంచి వచ్చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా.. నాగలక్ష్మి, రాధాకృష్ణ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డానికి తేల్చారు. అయితే.. ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు వారిద్దరు కలిసి ఎన్నో డ్రామాలు ఆడారు. చివరికి కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది.
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
దీంతో.. కోర్టు రాధాకృష్ణ, నాగలక్ష్మికి జీవిత ఖైదుతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. అంతేకాదు.. సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు గాను ఆ ఇద్దరికి మరో మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షల్ని ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో