రోడ్డు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలీని పరిస్థితి ఏర్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ట్రాలీ లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు . మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
https://ntvtelugu.com/ed-attacher-6-crore-property-of-balwinder-singh-in-money-landaring-case/
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చి తోటలో పనికి వెళుతున్నారు. శుక్రవారం ఉదయాన్నే మొగుళ్లపల్లి కు చెందిన అశోక్ లేలాండ్ ట్రాలీ లో బయలుదేరిన కొద్ది సేపటికే ఎదురుగా వస్తున్న లారీ సైడ్ నుంచి తగిలింది. దీంతో ట్రాలీలో పక్కన నిలబడి ప్రయాణిస్తున్న వారందరినీ గుద్దుకుంటూ వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. 8మందికి తీవ్ర గాయాలయ్యాయి . విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీ లో చికిత్స నిమిత్తం తరలించారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. దీంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.
