Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Bhimili Murder: భర్త వద్దు.. ప్రియుడే ముద్దు.. అనుకుంటున్నారు కొంత మంది భార్యలు. ప్రియుడి మోజులో పడి.. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. చివరికి కటకటాలపాలై.. జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా.. కనీసం ఆయా కేసులు చూసి కూడా తీరు మార్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి నేరాలే చేస్తూ.. పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలిలోనూ ఓ భార్య భర్తను అత్యంత దారుణంగా చంపేసింది. మర్డర్ కేసులో దొరికిపోతుందని డ్రామా ఆడినా.. పెద్దగా రక్తి కట్టలేదు. చివరికి పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది. ఇంతకీ ఆ కంత్రీ ఇల్లాలు ఎవరు? అసలేం జరిగింది?
భీమిలీ పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యని నిలదీసిన భర్తను హతమార్చింది భార్య. భర్త ఆరోగ్యం బాగోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని డ్రామాలాడింది. కొన ఊపిరితో ఉన్న భర్తను వైద్యం కోసం హాస్పిటల్కు తీసుకెళ్లి బంధువులను, వైద్యులను నమ్మించింది. చివరకు భర్త మెడ మీద ఉన్న గాయాలు అసలు గుట్టు రట్టు చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణికి వలందపేటకు చెందిన బోర సూరి తాతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. వలంద పేటలోనే భార్య భర్తలిద్దరూ నివాసం ఉంటున్నారు. భర్త సూరితాత తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భార్య నాగమణి స్థానికంగా ఓ నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో తరచూ నిలదీసేవాడు భర్త. ఇదే విషయమై దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి ఊపిరి తీసేసింది.
Also Read
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
అనంతరం ఏమీ తెలియనట్లు.. భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో నాగమణి డ్రామాకు బ్రేక్ పడింది. తానే చున్నీతో బిగించి సూరితాతను హతమార్చానని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఈ హత్యలో నాగమణి ఒక్కదాని పాత్ర ఉందా? లేదా ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భర్తను అత్యంత దారుణంగా చంపేసి డ్రామాలాడిన నాగమణిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!