Vikarabad Land Scam: దర్జాగా.. కబ్జా! రూ.5 కోట్ల భూమిని కేవలం రూ.5 లక్షలకే కొట్టేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Land Scam: భూమి.. కనిపిస్తే చాలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అమాయకుల భూములైతే.. నయానో భయానో భయపెట్టి.. ఎంతో కొంత చేతిలో పెట్టి లాగేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో సరిగ్గా ఇలాగే జరిగింది. 5 కోట్ల రూపాయల భూమిని కేవలం 5 లక్షలకే కొట్టేశారు. కొడుకుకు తెలియకుండా తల్లి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి కోసం అడిగితే రౌడీయిజం చేస్తున్నారు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
READ ALSO: Adulterated Ghee: కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లకు చెందిన మహిళ కురువ పద్మమ్మ. ఈమె హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ అనే మహిళ ఇంట్లో 2 నెలలుగా ఇంటి పని చేస్తోంది. నిజానికి పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో 2 ఎకరాల భూమి ఉంది. కానీ నీళ్లు లేకపోవడంతో.. పంటలు పండే పరిస్థితి లేక హైదరాబాద్లో ఇంటి పని చేసుకుంటోంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. పద్మమ్మకు 2 ఎకరాల భూమి ఉన్న విషయం ఇంటి యజమాని పోచమ్మకు తెలిసింది. మెల్లగా పద్మమ్మకు మాయమాటలు చెప్పింది. భూమి విక్రయానికి ఒప్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రూ. 5 లక్షలు చెల్లించింది. నిజానికి 2 ఎకరాల భూమి విలువ రూ. 5 కోట్లు ఉంటుంది. దీంతో అతి తక్కువ ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది…
రిజిస్ట్రేషన్ చేసుకున్న… సర్వే నెంబర్ 401లోని 2 ఎకరాల భూమి సర్వే చేస్తుండగా… ఆ నోటా ఈ నోటా పద్మమ్మ కొడుకు సురేష్కు తెలిసింది. దీంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పుకున్నాడు. ఫలితంగా గ్రామస్తులంతా భూమి వద్దకు వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే అప్పటికే పోచమ్మకు చెందిన దాదాపు 100 మంది గుండాలు తమను బెదిరించారని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు తమ తల్లిని మోసం చేసి.. ఖరీదైన భూమిని తక్కువ ధరకు లాగేసుకున్నారని.. కొడుకు సురేష్ చెబుతున్నాడు..
చివరికి భూమి పంచాయితీ కాస్తా.. పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు పోచమ్మ.. పంపించిన కిరాయి గుండాలను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. భూమి విలువ తెలిసే.. మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. పద్మమ్మ కుటుంబీకులు అంటున్నారు… మరోవైపు ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహశీల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు…
READ ALSO: Ananthapur Crime: కటకటాల వెనక్కి.. తండ్రిని చంపిన కొడుకు
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!