Ananthapur Crime: కటకటాల వెనక్కి.. తండ్రిని చంపిన కొడుకు
- తల్లిని వేధించడంపై తండ్రిని ప్రశ్నించిన కొడుకు
- క్షణికావేశంలో రోకలిబండతో తండ్రిపై దాడి
- అనంతపురం జిల్లా పామిడిలో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananthapur Crime: క్షణికావేశం.. మనిషిని రాక్షస్తున్ని చేస్తుంది. ఇలాంటి ఆవేశమే అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఉసురు తీసింది. కన్న కొడుకు చేతిలోనే వ్యక్తి బలి కావాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. తండ్రిని చంపిన కొడుకు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆయన పేరు సుధాకర్. అనంతపురం జిల్లా పామిడిలో బెస్తవీధిలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాశ్ ఉన్నారు. లారీ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సుధాకర్.. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి వచ్చి ఇంట్లో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో భార్య మీనాక్షితో రోజూ గొడవ అవుతోంది…
READ ALSO: OG : పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్..
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
ప్రతి రోజూ తండ్రి తీరును గమిస్తున్నాడు కొడుకు ప్రకాశ్. రోజూ తల్లిని వేధించడంపై తండ్రిని ప్రశ్నించే వాడు. ఐతే మైనర్ కావడంతో తండ్రి సుధాకర్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మరోవైపు 3 రోజుల క్రితం కూడా సుధాకర్ ప్రవర్తన మరింత శ్రుతి మించింది. భార్య మీనాక్షిపై చేయి చేసుకున్నాడు. మద్యం తాగేసి నానా యాగీ చేశాడు. దీంతో తండ్రిని మందలించాడు కొడుకు. కానీ వినిపించుకోకపోవడం.. మరింత గొడవ చేయడంతో.. క్షణికావేశంలో రోకలిబండతో తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో సుధాకర్ తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపటికే మృతి చెందాడు…
ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుధాకర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కుమారున్ని అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు..కొడుకు చేతిలో భర్త చనిపోవడం… కొడుకు జువైనల్ హోమ్కు వెళ్లడంతో మీనాక్షి ఒంటరిగా మిగిలిపోయింది…
READ ALSO: Nizamabad Cybercrime Scam: లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశ పడతారు.. కానీ!
తాజావార్తలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..