Site icon NTV Telugu

Uttar Pradesh: ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా భోజనం.. అంతలోనే కత్తితో దాడిలో ఇద్దరు మృతి

Up

Up

Uttar Pradesh: ఓ కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం ఘోర విషాదానికి దారి తీసింది. గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో జరిగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసి ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్పూర్వ గ్రామంలో బుధవారం నాడు రాత్రి జరిగింది.

Read Also: UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే సమయంలో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత తన అన్న హరీష్ (40), తమ్ముడు రాముపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఇక, మధ్యలో అడ్డుకోవడానికి వచ్చిన హరీష్ భార్య పూనమ్‌పై కూడా దాడి చేశాడు. దీంతో
ముగ్గురికి కత్తిపోట్లు తగిలాయి. వారిని నైమిశారన్య కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చికిత్స కోసం తరలించారు. కాగా, పూనమ్‌ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించగా, హరీష్ చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే, రాము తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Read Also: JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!

కాగా, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము ఒక్కసారిగా ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని తెలిపారు. అయితే, చనిపోయిన హరీష్, పూనమ్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version