Uttar Pradesh: ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా భోజనం.. అంతలోనే కత్తితో దాడిలో ఇద్దరు మృతి
- యూపీలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
- ఉమ్మడి కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా కత్తితో దాడి..
- కత్తితో దాడిలో ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఓ కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం ఘోర విషాదానికి దారి తీసింది. గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో జరిగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసి ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్పూర్వ గ్రామంలో బుధవారం నాడు రాత్రి జరిగింది.
Read Also: UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే సమయంలో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత తన అన్న హరీష్ (40), తమ్ముడు రాముపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఇక, మధ్యలో అడ్డుకోవడానికి వచ్చిన హరీష్ భార్య పూనమ్పై కూడా దాడి చేశాడు. దీంతో
ముగ్గురికి కత్తిపోట్లు తగిలాయి. వారిని నైమిశారన్య కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చికిత్స కోసం తరలించారు. కాగా, పూనమ్ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించగా, హరీష్ చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే, రాము తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
కాగా, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము ఒక్కసారిగా ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని తెలిపారు. అయితే, చనిపోయిన హరీష్, పూనమ్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!