Uttar Pradesh: ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా భోజనం.. అంతలోనే కత్తితో దాడిలో ఇద్దరు మృతి
- యూపీలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
- ఉమ్మడి కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా కత్తితో దాడి..
- కత్తితో దాడిలో ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..
Uttar Pradesh: ఓ కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం ఘోర విషాదానికి దారి తీసింది. గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో జరిగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసి ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్పూర్వ గ్రామంలో బుధవారం నాడు రాత్రి జరిగింది.
Read Also: UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి
అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే సమయంలో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత తన అన్న హరీష్ (40), తమ్ముడు రాముపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఇక, మధ్యలో అడ్డుకోవడానికి వచ్చిన హరీష్ భార్య పూనమ్పై కూడా దాడి చేశాడు. దీంతో
ముగ్గురికి కత్తిపోట్లు తగిలాయి. వారిని నైమిశారన్య కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చికిత్స కోసం తరలించారు. కాగా, పూనమ్ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించగా, హరీష్ చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే, రాము తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
కాగా, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము ఒక్కసారిగా ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని తెలిపారు. అయితే, చనిపోయిన హరీష్, పూనమ్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’లో ఫుల్ లెంగ్త్ కామెడీ..
-
Iran: అసిమ్ మునీర్.. ట్రంప్ భజనపరుడు.. ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
-
Ishan Kishan-SRH: మా ప్లాన్ చాలా సింపుల్.. ఆటగాళ్లకు అదొక్కటి మాత్రం చెబుతాను!
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mumbai: ర్యాలీతో భారీ ట్రాఫిక్ జామ్.. మంత్రిని రప్ఫాడించిన మహిళ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!