NTV Telugu Site icon

UP Shocker: అత్యాచారానికి గురైన 17 ఏళ్ల కుమార్తె.. పరువు పొతుందని తల్లి, సోదరుల దారుణం..

Up Shocker

Up Shocker

UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: PM Modi US Visit : యూఎస్‌లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’

సెప్టెంబర్ 18న బాలిక తన సోదరుడు, తల్లితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా తుపాకీతో కాల్చి చంపిన ఘటన నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రింకూ(20) అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని, ఫిబ్రవరిలో అతడిపై ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెలలో రింకూకు బెయిల్ వచ్చింది. తమ కూతురిని రింకూనే తన సహచరులతో కలిసి పగతీర్చుకునేందుకు చంపాడని బాలిక కుటుంబం ఆరోపించింది. దీంతో పోలీసులు రింకూని, అతడి సహచరులని అరెస్ట్ చేశారు.

అయితే, వీరిని విచారించిన నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో, బాలిక తల్లి ఆమె ఇద్దరు సోదరులు ఆమెను చంపడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. బాలిక సోదరుడు వినీత్ తన మామ మహావీర్‌తో కలిసి తన సోదరి, సోదరుడు నీరజ్, తల్లి బ్రిజ్వతితో కలిసి మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి ప్లాన్ చేసి చంపారు. ప్రస్తుతం మహావీర్ పరారీలో ఉండగా, నీరజ్, వినీత్, బ్రిజ్బతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన దేశీ తుపాకీని, మోటార్ సైకిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ సాగుతోందని పోలీసులు వెల్లడించారు.