UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం
- మరో వివాహితతో మాజీ సర్పంచ్ అక్రమ సంబంధం
- హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా.. ఉత్తరప్రదేశ్లోని సుమేర్పూర్ గ్రామ మాజీ సర్పంచ్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కిస్మతుల్ నిషాకు తొమ్మిది మంది పిల్లలు ఉండగా.. రెండో భార్య అంబియా బానోకు కూడా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. మొత్తంగా 18 మంది పిల్లలున్నారు. అయితే గ్రామ సర్పంచ్గా పని చేసిన మున్నా బుద్ధి మాత్రం మంచిగా లేదు. ఇద్దరు భార్యలుండి.. 18 మంది పిల్లలుండి కూడా వంకర బుద్ధి చూపించాడు.
గ్రామంలో ఉన్న సుమన్ దేవి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమన్ దేవి భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదే అదునుగా ఆమెకు సాయం పేరుతో దగ్గరయ్యాడు. పదే పదే కలవాలంటూ ఒత్తిడి తేవడం.. అక్కడితో ఆగకుండా బ్లాక్మెయిల్కు దిగాడు. ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో తన సోదరుడితో కలిసి మున్నా హత్యకు ప్రణాళిక రచించింది. ప్లాన్లో భాగంగా మార్చి 18న తన పుట్టింటికి సుమన్ దేవి ఆహ్వానించింది. దీంతో మున్నా గదిలోకి రాగానే సోదరుడు, అతడి అనుచరులు కలిసి రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి కాలువలో పడేశారు.
అయితే మున్నా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో దిగారు. మున్నా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి బైక్ వేరే చోట గుర్తించారు. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్స్ ప్రకారం నిందితురాలను గుర్తించారు. విచారించగా తన సోదరుడితో కలిసి హత్య చేసినట్లుగా సుమన్ దేవి ఒప్పుకుంది. అనంతరం మార్చి 22 (ఆదివారం)న కాలువ దగ్గర మున్నా మృతదేహాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
మున్నాకు ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్నారని.. ఒక కుమార్తెకు వివాహం కూడా జరిపించాడని పోలీసులు తెలిపారు. మరోసారి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలని సిద్ధపడుతున్నాడని.. ఈ క్రమంలో సుమన్ దేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. పదే పదే బెదిరించడంతో ప్రియురాలు చంపేసిందని వెల్లడించారు. అయితే మున్నా చనిపోవడంతో ఇద్దరు భార్యలు, పిల్లలు తీవ్ర విషాదంతో కన్నీరు మున్నీరయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
తాజావార్తలు
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్షిప్పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..