రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడిని ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో..
పూర్తి వివరాల్లోకి వెళితే.. టోంక్ జిల్లాలోని బెల్హారి గ్రామంలో ముగ్గురు మామలు తమ మేనల్లుడు సురేష్ను ఒక భూ వివాదంపై టీ తాగించడానికి ప్రలోభపెట్టి, గొడ్డలితో దాడి చేసి చంపారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిన 72 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతుడు సురేష్ గుర్జార్ తన అన్నయ్య మన్రాజ్ తో కలిసి గ్రామంలో జరిగిన కమ్యూనిటీ విందుకు వెళ్తున్నాడు. దారిలో, అతని ముగ్గురు మామలు రామేశ్వర్, బాబులాల్, ఛోటు మహారాజ్, అతనిని ఛాయ్ తాగుదామని మాయ మాటలు చెప్పి అతడిని ఇంట్లోకి తీసుకెళ్లారు.సురేష్ లోపలికి రాగానే, ముగ్గురు మామలు, వారి కుమారుడు సోను, అతని భార్య లక్ష్మితో కలిసి గొడ్డలి, కర్రలతో అతనిపై దాడి చేసి.. ఆపై హత్య చేశారు.
Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉండడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి అన్న మన్రాజ్ ప్రభుత్వాన్ని కోరాడు.
