Moolakona Mystery: ఆస్తి కోసమా.. పరువు కోసమా? మూలకోన అటవీ ప్రాంతంలో మిస్టరీ డెత్స్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moolakona Mystery: తిరుపతి జిల్లా చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బాగా కుళ్లిన స్థితిలో డెడ్ బాడీలు కనిపించాయి. అక్కడికి వెళ్లిన పశువుల కాపరులు.. వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని అటవీప్రాంతంలో బయటపడ్డ మృతదేహాల కేసులో మిస్టరీ వీడలేదు. మహిళ, వ్యక్తి మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి పోలీసులు అక్కడే ఖననం చేశారు. మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా వీటిని హత్యలుగా పోలీసులు నిర్ధారించారు. గ్లౌజులు, దుస్తులు కుక్కి.. నోటికి ప్లాస్టర్ వేసినట్లు తెలిపారు. మృతుడిని తమిళనాడులోని తంజావూర్కు చెందిన కలై సెల్వన్గా గుర్తించారు. హత్యకు గురైన మహిళ అతడి వదిన, ఆమె పిల్లలుగా భావిస్తున్నారు. ఆస్తి కోసం జరిగిన హత్యా? లేదా పరువు హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
READ ALSO: Cyber Fraud: బల్క్గా వస్తువులను తక్కువ ధరకు అమ్ముతున్నామని ప్రకటన.. నమ్మారో అంతే..!!
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
సెప్టెంబర్ 14న మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఐతే ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. అదే సమయంలో పక్కనే ఓ వస్త్రం కప్పి ఉన్న స్థితిలో మహిళ శవం పడి ఉంది. అంతే కాదు ఆ పక్కనే మరో రెండు గోతులు తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లూ కనిపించాయి. అందులో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి..
పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్దేనని గుర్తింపు
తొలుత వీటిని గుర్తు తెలియని డెడ్ బాడీలుగా పోలీసులు భావించారు. ఐతే అక్కడ లభించిన కొన్ని క్లూల ఆధారంగా హత్యగా నిర్ధారించారు. మొత్తంగా అక్కడ లభించిన నాలుగు మృతదేహాలపై పోలీసులు ఎట్టకేలకు క్లారిటీకి వచ్చారు. సెప్టెంబర్ 15న పోలీసులు గుర్తించిన మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్దేనని తేలింది. ఇందుకు సంబంధించి అక్కడ వారికి ఓ ఆస్పత్రికి సంబంధించిన చీటి లభించింది. అదే ప్రదేశంలో లభించిన మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె ఇద్దరు కుమార్తెలవే కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
జయమాలిని, ఇద్దరు పిల్లలపై మిస్సింగ్ కేసు నమోదు
అయితే గత జులైలో జయమాలిని, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జయమాలిని భర్త వెంకటేశన్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కువైట్లో పని చేస్తున్న వెంకటేశన్, జులైలో ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ప్రస్తుతం వెంకటేశన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కలై సెల్వన్కు జయమాలిని కుటుంబంతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే, నలుగురి మరణాలు హత్యలేననే అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?