ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్తకు తెలియడంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే ఈ హత్య చేసినట్లు నిర్దారించి వారిని అరెస్ట్ చేశారు.
వివరాలలోకి వెళితే.. భీమడోలు ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వడ్డిగూడం కూలీ పనులకు వెళ్లిన భార్య అక్కడ పనిచేసే పెంటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రోజు ఇంటి నుంచి పనికి వెళ్తున్నా అని చెప్పి ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. కొద్దిరోజులకు ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి, భర్త ప్రాణాలతో ఉంటే మనం కలవడం అసాధ్యమని తెలిపింది. దీంతో ఇద్దరు అతడిని హత్యచేయాలని ప్లాన్ వేశారు. ఇటీవల భర్తకు అనారోగ్యంగా ఉండడంతో తెలిసిన వ్యక్తిగా ప్రియుడు పెంటయ్య, ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె భర్తను పలకరించాడు.
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
అక్టోబర్ 3 న హస్పిటల్ కి వెళ్లి మందులు తీసుకురావడానికి అతనికి తోడుగా వెళ్లిన పెంటయ్య నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి, ప్రియురాలి భర్తను రాడ్డుతో కొట్టి చంపేశాడు. అనంతరం బైక్ ని కూడా ధ్వంసం చేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాడు. దెబ్బలు తనకు తగలకపోతే అనుమానమొస్తుందని పక్కనే ఉన్న గొయ్యిలో స్పృహ తప్పినట్లు నాటకమాడాడు. మొదట ఈ కేసును రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులకు భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో వారు లోతుగా ఈ కేసును విచారించగా గుట్టు బయటపడింది. ప్రియుడితో కలిసి ఉండాలని ఈ పని చేసినట్లు భార్య చెప్పగా, ప్రియురాలి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే వైఎస్ఆర్ భీమా పథకం కింద రూ. 5 లక్షలు వస్తాయని తెలియడంతో అతనిని చంపి, ఆ డబ్బుతో ప్రియురాలితో ఉండొచ్చని ఈ ప్లాన్ వేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!