Bridegroom Cheating: నిత్య పెళ్లికొడుకు.. ఆ ఒక్క తప్పు చేసి, అడ్డంగా దొరికాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Bridegroom Arrested For Marrying Minor Girl: కొందరు ప్రబుద్ధులు ఎందుకో ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు. నచ్చిన ప్రతీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ.. ‘నిత్య పెళ్లికొడుకు’ అవతారాలు ఎత్తుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ.. మోసాలకు పాల్పడుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కూడా నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే.. నాలుగో పెళ్లి విషయంలో చేసిన తప్పు కారణంగా, అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్(38)కి, కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఇద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ.. ఆ తర్వాత చిన్న చిన్న విషయాల్లో మనస్పర్థలు ఏర్పడటం, అవి పెద్దవిగా మారడంతో ఇద్దరు విడిపోయారు.
అలా రేఖకు విడాకులిచ్చిన కొన్ని రోజుల్లోనే లత అనే మరో యువతిని సతీష్ పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు ఆమెతో కాపురం చేస్తుండగానే.. అతనికి మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారడంతో.. లతకు తెలియకుండా మురుగలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అరుప్పుకోటైలో మరో కాపురం పెట్టాడు. అంతటితో మనోడి పెళ్లి కోరిక తీరలేదు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ 17 ఏళ్ల యువతితో సతీష్కి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి అందంగా ఉండటంతో, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట మాయమాటలు చెప్పి, ఆమెని వలలో వేసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటే బాగా చూసుకుంటానని నమ్మించాడు. పాపం, అతని మాయమాటలకు పడిపోయి అమ్మాయి ఒప్పుకుంది. దీంతో.. ఆ యువతిని పెళ్లి చేసుకొని, మరో చోట కొత్త కాపురం పెట్టాడు. అయితే.. మేకలు మేపడానికి వెళ్లిన తన కూతురు తిరిగి రాకపోవడం, ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆ యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Also Read
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ యువతి ఉళుందూరుపేటలోని సతీష్ సోదరి ఇంట్లో ఉందని గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకొని, ఆమెను రక్షించి, విరుదునగర్లోని ఒక ఆశ్రమంలో ఉంచారు. సతీష్ కోసం గాలించగా.. అతడు అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. దాంతో, ఆ ప్రాంతానికి వెళ్లి, సతీష్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మేజర్ కాని యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో.. పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!