పాకిస్థాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి డ్రగ్స్ కు బానిసయ్యాడని హత్య చేశాడు. ఈ ఘటన టిబ్బా సుల్తాన్పూర్లో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ముల్తాన్-వెహారి పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానిక సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పాకిస్తాన్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం నిందితుడు అలీ హసన్ (15)ను అదుపులోకి తీసుకున్నారు.
Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్తో ఆప్ సెటిల్మెంట్..?
కాగా.. హత్యకు సంబంధించి నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అయితే తన తండ్రి మద్యం మత్తులో తన తల్లిని మాటలతో, శారీరక వేధింపులకు గురిచేసేవాడని కొడుకు పోలీసులకు తెలిపాడు. అందువల్ల కోపంతో హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా.. హత్యకు సంబంధించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Pista Benefits: రోజుకు పది పిస్తా పప్పులను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మరోవైపు.. ఇలాంటి ఘటనే ఏప్రిల్ 24న ఒకటి చోటు చేసుకుంది. కోపంతో చేసిన ఘటనతో కుటుంబం అల్లకల్లోలమైంది. కుమారుడే తన తండ్రిని, మామను కాల్చి చంపాడు. కారు విషయంలో వివాదం నెలకొంది. తండ్రి సాజిద్, నిందితుడి మామ వకాస్ కోర్టు నుండి తిరిగి వస్తుండగా దాడి జరిగినట్లు లా ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది. కొడుకు జైన్ వారిని ఆపి కాల్పులు జరపడంతో తండ్రి, మామ అక్కడికక్కడే మృతి చెందారు. హత్య చేసిన అనంతరం నిందితుడు కొడుకు కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు.