Bengaluru: సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం
- బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్
- రూ.11.8 కోట్లు మాయం.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్లు హడలెత్తిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు సరికొత్త దురాగతాలకు పాల్పడుతున్నారు. వారి వలలో చిక్కుకుంటున్న ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భయాందోళనకు గురై కోట్లాది రూపాయులు జార విడుచుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఒక సాప్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా రూ.11 కోట్లకుపైగా నగదు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు.
బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవంబర్ 11న ‘‘డిజిటల్ అరెస్ట్’’కు బలి అయ్యాడు. మోసగాళ్ళు పోలీసు అధికారులుగా మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని బెదిరింపులకు దిగారు. ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని మోసగాడు బెదిరించాడు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. వర్చువల్ విచారణకు సహకరించాలని లేదంటే అరెస్ట్లు తప్పవని తీవ్రంగా బెదిరించాడు. దీంతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 మధ్య దపదపాలుగా రూ.11.8 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు మళ్లించుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 11న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన సిమ్ కార్డును అక్రమ ప్రకటనలు, వేధింపుల సందేశాలకు ఉపయోగించారని మోసగాడు బెదిరించాడని పేర్కొన్నారు. అనంతరం మనీలాండరింగ్ కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఆధార్ వివరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో బాధితుడు పేర్కొన్నాడు. స్కైప్ యాప్ను డౌన్లోడ్ చేయమని కోరుతూ మరొక వ్యక్తి నుంచి అతనికి కాల్ వచ్చింది. దాని తర్వాత ముంబై పోలీసు యూనిఫాం ధరించిన మరొక వ్యక్తి వీడియో-కాల్ చేసి ఒక వ్యాపారవేత్త ఆధార్ను ఉపయోగించి రూ. విలువైన లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంక్ ఖాతాను తెరిచాడని పేర్కొన్నాడు. రూ. 6 కోట్లు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మోసగాడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. వర్చువల్ విచారణకు సహకరించకపోతే భౌతికంగా అరెస్టు చేస్తామని బెదిరించాడు. నవంబర్ 25న పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి అతనికి స్కైప్లో కాల్ చేసి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని బెదిరించాడు. నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే కుటుంబాన్ని అరెస్టు చేస్తామని బెదిరించాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడు అరెస్ట్కు భయపడి రూ.11.8 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత (BNS) ఐటీ చట్టం మరియు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?