ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
- రూ.100 కోట్లు కూడబెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు
- భారీగా ఆస్తులు కూడబెట్టిన భూ సర్వే & భూ సంస్కరణల రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్
- శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
- సోదాల్లో భారీగా బయటపడిన ఆస్తులు
- మై హోం భూజాలో ఒక ఫ్లాట్
- నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.
శ్రీనివాసులు హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు తెలిసిన ఆదాయ వనరుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆస్తులు ఉండటంతో ఏసీబీ అప్రమత్తమైంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, డిసెంబర్ 4న శ్రీనివాసులు నివాసంతో పాటు ఆయన బంధువులు, మిత్రులు, బినామీలకు చెందిన ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
Jupally Krishna Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయోచ్చో.. రెండేళ్లలో చేసి చూపించాం
ఈ దాడుల్లో పలు కీలక ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో మై హోం భుజ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్, నారాయణపేటలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా రైస్ మిల్లు ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో మరో 11 ఎకరాల భూమి, మహబూబ్ నగర్లో 4 ప్లాట్లు, మరియు నారాయణపేటలో 3 ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
ఆస్తులతో పాటు, ఏసీబీ అధికారులు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇంకా, కియా సెల్టోస్ హైక్రాస్ కారు, ఇన్నోవా కారు వంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ఆస్తులన్నీ పత్రాల్లో చూపిన విలువ కంటే మార్కెట్ ధర ప్రకారం చాలా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Deputy CM Pawan Kalyan: సంతోషంగా ఉంది.. చిత్తూరు జిల్లా అధికారులను పవన్ కల్యాణ్ అభినందనలు..
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!