ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
- రూ.100 కోట్లు కూడబెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు
- భారీగా ఆస్తులు కూడబెట్టిన భూ సర్వే & భూ సంస్కరణల రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్
- శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
- సోదాల్లో భారీగా బయటపడిన ఆస్తులు
- మై హోం భూజాలో ఒక ఫ్లాట్
- నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.
శ్రీనివాసులు హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు తెలిసిన ఆదాయ వనరుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆస్తులు ఉండటంతో ఏసీబీ అప్రమత్తమైంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, డిసెంబర్ 4న శ్రీనివాసులు నివాసంతో పాటు ఆయన బంధువులు, మిత్రులు, బినామీలకు చెందిన ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
Jupally Krishna Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయోచ్చో.. రెండేళ్లలో చేసి చూపించాం
ఈ దాడుల్లో పలు కీలక ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో మై హోం భుజ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్, నారాయణపేటలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా రైస్ మిల్లు ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో మరో 11 ఎకరాల భూమి, మహబూబ్ నగర్లో 4 ప్లాట్లు, మరియు నారాయణపేటలో 3 ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
ఆస్తులతో పాటు, ఏసీబీ అధికారులు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇంకా, కియా సెల్టోస్ హైక్రాస్ కారు, ఇన్నోవా కారు వంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ఆస్తులన్నీ పత్రాల్లో చూపిన విలువ కంటే మార్కెట్ ధర ప్రకారం చాలా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Deputy CM Pawan Kalyan: సంతోషంగా ఉంది.. చిత్తూరు జిల్లా అధికారులను పవన్ కల్యాణ్ అభినందనలు..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!