Relationship: ‘‘ ఫేస్బుక్ పరిచయం, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి’’.. వివాహిత దారుణ హత్య..
- ఫేస్బుక్ పరిచయం, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి..
- వివాహితను హత్య చేసిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Relationship: ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. ఆ తర్వాత ప్రాణాలను తీసింది. కర్ణాటక హసన్లో ఒక మహిళను ఫేస్బుక్లో పరిచమైన వ్యక్తి హత్య చేశాడు. 28 ఏళ్ల వివాహిత తనతో శృంగార సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడంతో, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీని తర్వాత నిందితుడు మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మాండ్యాలోని తన వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు.
నిందితుడు పునీత్, 28 ఏళ్ల ప్రీతి అనే వివాహితతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరు తరుచుగా ఆన్లైన్లో మాట్లాడుకోవడంతో పాటు, ఫోన్ కాల్స్ చేసుకునే వారు. ఆదివారం నాడు ఇద్దరూ మొదటిసారిగా వ్యక్తిగతంగా కలుసుకున్నారు. పునీత్ ప్రీతిని హసన్ నుంచి మైసూరుకు రెంట్ తీసుకున్న కారులో తీసుకెళ్లాడు. కొన్ని ప్రదేశాలు తిరిగిన తర్వాత, వీరిద్దరు కృష్ణ రాజ సాగర్ సమీపంలోని ఒక లాడ్జ్లో దిగారు. ఆ తర్వాత ఇద్దరు లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నారు.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Read Also: Viral Video: ఎద్దు ముందు మోకరిల్లిన రెండు క్రూరమైన జాగ్వార్లు.. షాకింగ్ వీడియో
అయితే దీని తర్వాత, ప్రీతి తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని పునీత్పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమె పదేపదే శృంగార సంబంధం కొనసాగించాలని పట్టుబట్టడంతో కట్టెరఘట్టలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఆ సమయంలో ప్రీతి తలపై పునీత్ కొట్టాడని పోలీసులు చెప్పారు. రాయితో తలపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత మృతదేహాన్ని నిందితుడు తన సొంత గ్రామం కరోతిగ్రామ్కు తరలించి, తన వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు.
జూన్ 23న హసన్లో ప్రీతి భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు మాండ్య పోలీసు సూపరింటెండెంట్ మల్లికార్జున్ బాలదండి చెప్పారు. పోలీసులు ఆమె నెంబర్కి ఫోన్ చేయగా పునీత్ సమాధానం ఇచ్చాడని తేలింది. ప్రీతి తన కారు అద్దెకు తీసుకుని బస్సు ఎక్కి, ఫోన్ మరిచిపోయిందని చెప్పాడు. అయితే, సమీపంలో దొరికిన మహిళ మృతదేహం గురించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అది ప్రీతి డెడ్బాగీ భర్త గుర్తించాడు. దీంతో పునీత్ హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజులుగా పునీత్, ప్రతీ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినప్పటికీ, వారిద్దరు వ్యక్తిగతం తొలిసారి కలుసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!