EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
- ట్రాక్టర్ ఫైనాన్స్ డబ్బులు చెల్లించడానికి దారుణం..
- తల్లీకూతుళ్లను హత్య చేసిన సొంత బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EMI Crime: అప్పుతో ట్రాక్టర్ కొనుగోలు చేసి EMI చెల్లించడానికి డబ్బులు లేవని సొంత బంధువులే దారుణహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగింది. తల్లికూతుళ్లను సొంత బంధువులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి, మృతుల వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించేందుకు హత్యకు పాల్పడ్డారు.
మే 28న జిల్లాలోని దేవ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతామాత అభయారణ్యంలోని భోపఖేడా పాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంకీ మీనా, ఆమె కుమార్తె కమల ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఆమె మరిది బాబులాల్ మీనా, అతడి భార్య గెండాబాయిలు కలిసి హత్య చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి మంకీ మీనా వెండి కంకణాలు, ఇతర ఆభరణాలు, నగదును దొంగిలించారు. దొంగిలించిన ఆభరణాలను అమ్మేసి, ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేద్దామని భావించారు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్, సైబర్ టీమ్ సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించారు. జూన్ 11న అటవీ ప్రాంతంలో నిందితుడు దాగి ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు బాబూలాల్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడితో పాటు భార్య గెండాబాయిని కూడా అరెస్ట్ చేశారు.
నిందితుడు బాబూలాల్ ఇటీవల ఒక సెకండ్ హ్యాండ్ సోనాలిక ట్రాక్టర్ను రూ. 2.55 లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో మంకీ మీనా వద్ద బంగారం, వెండి ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నేరం చేసిన తర్వాత కూడా ఇద్దరు నిందితులు మృతుల వద్ద దు:ఖిస్తూ నటించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, ఇతర వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!