Bihar: బీహార్లో కాల్పుల కలకలం, 24 గంటల్లో నలుగురి హత్య..
- బీహార్లో కాల్పుల కలకలం..
- 24 గంటల్లో నలుగురి హత్య..
- పోలీస్ స్టేషన్ సమీపంలో న్యాయవాది మర్డర్..
- ఎన్నికల ముందు భయాందోళనల్లో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
పాట్నాలోని సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్కు 300 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. వరసగా బీహార్లో జరుగుతున్న కాల్పుల ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. మృతుడు జితేంద్ర కుమార్ ప్రతీ రోజు సాధారణంగా వచ్చే టీ కొట్టు వద్ద ఈ హత్య జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత నేరస్తులు పారిపోయారు. పాట్నా ఎస్పీ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. కాల్పుల తర్వాత, అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించామని, గాయాల కారణంగా మరణించారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మూడు ఖాళీ బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Read Also: Jharkhand: ఏంటీ 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగాయా..? ఏం కవరింగ్ భయ్యా..
దీనికి ముందు శనివారం బీహార్లోని సీతామర్హి జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతమైన మెహసౌల్ చౌక్ వద్ద వ్యాపారవేత్త పుతు ఖాన్ తలపై గుర్తు తెలియని దుండగులు పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. గంటల వ్యవధిలోనే పాట్నా జిల్లాలోని షేక్ పురాలో వెటర్నరీ డాక్టర్ సురేంద్ర కుమార్ (50) తన పొలంలో కాల్చి చంపబడ్డాడు. బైక్ పై వచ్చని దుండగులు కాల్పులు జరిపారు. వీటికి ముందు శుక్రవారం సాయంత్రం పాట్నాలోని రామకృష్ణ నగర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుడు కిరాణా దుకాణం యజమాని విక్రమ్ ఝాను కాల్చి చంపారు. ఈ కాల్పుల ఘటనల్లో ఇప్పటి వరకు దుండగులు దొరకలేదు.
తాజావార్తలు
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?