Wife torture: భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి.. రైలు కింద పడి సూసైడ్..
- భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి..
- రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భర్త..
- తన భార్య మానసికంగా వేధిస్తుందని వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife torture: భార్యలు, అత్తమామల వేధింపులకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూర్లో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య మొదలు అప్పటి నుంచి చాలా మంది భార్యల వేధింపుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా, ఒడిశాకు చెందిన మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తన బాధను వీడియోలో వెల్లడించారు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడిని కుంభర్బస్తాకు చెందిన రామచంద్ర బర్జెనాగా గుర్తించారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఆత్మహత్యకు ముందు తన భార్య రూపాలిపై ఆరోపణలు చేశారు. ‘‘ నేను రామచంద్ర బర్జెనా, నేను కుంభర్బస్తాలో నివసిస్తాను. నా భార్య కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.’’ అని వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. రామచంద్ర రూపాలిని వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రూపాలి తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని, ఇంట్లో అల్లర్లకు కారణమవుతుందని రామచంద్రం తీవ్ర భావోద్వేగంతో చెప్పాడు. విడాకులు ఇస్తానని తనను తన కుటుంబాన్ని బెదిరిస్తోందని వెల్లడించాడు.
ఈ సంఘటన తర్వాత రామచంద్ర తల్లిదండ్రులు కూడా భార్య, ఆమె కుటుంబం తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 351(2), మరియు 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన కోడలు పదేపదే తన తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లేదని, అడ్డు చెబితే తిట్టేదని రామచంద్ర తల్లి ఆరోపించింది. పెళ్లికి అయ్యే మొత్తం ఖర్చుని కూడా తమ కుటుంబమే భరించిందని, రూపాలి కుటుంబానికి రూ. 20 లక్షలు అప్పుగా ఇచ్చామని చెప్పింది. వారి పెళ్లి జరిగి రెండేళ్లు మాత్రమే అయిందని, అప్పటి నుంచి తన కొడుకును కోడులు చిత్ర హింసలు పెడుతూనే ఉందని ఆమె చెప్పింది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!