Site icon NTV Telugu

Shocking: యువతిపై అత్యాచారం, 17 మందికి డీఎన్ఏ పరీక్షలు.. నిజం తెలిసి అంతా షాక్..

Crime

Crime

Shocking: ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో 20 ఏళ్ల యువతిపై జరిగిన ఘోర అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. మూగ, చెవిటి అమ్మాయి అమ్మాయిపై సొంత తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2025 సెప్టెంబర్ లో యువతి కడుపులో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో, ఆమె నానమ్మ ముంబైలోని కామా అండ్ అబ్లేస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది.

Read Also: High Court: అలా చేస్తే భార్యకు “భరణం” చెల్లించాల్సిన అవసరం లేదు..

ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట యువతి సరిగా ఇవ్వలేకపోవడంతో పోలీసులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తండ్రి లైంగిక వేధింపుల్ని కొట్టిపారేశారు. తన కుమార్తె ఎలా గర్భవతి అయిందో వివరించలేకపోయాడు. ఈ కేసులో ముందుగా ఒక వ్యక్తితో పాటు 17 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో తండ్రితో పాటు అనుమానం ఉన్న 17 మంది డీఎన్ఏలను, గర్భంలో ఉన్న పిండం డీఎన్ఏలతో పోల్చి చూసినప్పుడు షాకింగ్ విషయం తేలింది. యువతి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రే కారణమని తెలిసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, 2025 మార్చి నెల నుంచి యువతిపై అత్యాచారం జరిగినట్లు చెప్పారు. ఈ కేసులో తండ్రితో పాటు అరెస్టయిన మరో ఇద్దరి వ్యక్తుల పాత్రలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version