Site icon NTV Telugu

Karnataka: ఇంట్లో ఉరేసుకున్న తల్లీకొడుకులు.. కారణమేంటో?

Bengaluru

Bengaluru

Karnataka: కర్ణాటకలో బెంగళూరులోని హోసగుడ్డదహళ్లి వద్ద తల్లి, కొడుకు వారి ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. వీరిద్దరిని లక్ష్మమ్మ (48), ఆమె కుమారుడు మదన్ (13)గా గుర్తించారు. “బయటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 2.15 గంటలకు సమాచారం అందింది. అందులో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు మదన్ హోసగుడ్డదహళ్లిలోని వారి ఇంటిలో కిటికీకి ఉరివేసుకుని ఉన్నట్లు నివేదించబడింది” అని వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లక్ష్మణ్ బి.నింబరాగి తెలిపారు.

Mother-Son Case Mystery: తల్లికొడుకుల హత్య.. హంతకుల్ని పట్టించిన వీడియో కాల్

మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విషయాన్ని పరిశీలిస్తున్నామని డీసీపీ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version