New Delhi: బ్యాగ్ తెరచి చూసి ఖంగుతిన్న ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వాచీలను పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 28.18కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన వాచ్ లను అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రయాణికులను చెక్ చెస్తున్న క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్ ను తెరచి చూశారు. అందులో గోల్డ్ అండ్ డైమండ్స్ తో తయారు చేసిన వాచీలను అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వాచీలను ట్రాలీ బ్యాగ్ కింది భాగం లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. మొత్తం ఏడు వాచీలను ఆ ప్రయాణికుడు బ్యాగ్ లో పెట్టి తరలించే ప్రయత్నం చేశాడు. అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వాచీలతో పాటు ఒక డైమండ్ పొందిగిన బంగారు బ్రాస్ లెట్, ఐ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ 110 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
Read Also: Ind vs SA: 40 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
పట్టబడ్డ గడియారాలలో ఒకదాని ధర అత్యధికంగా ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. అక్టోబర్ 4న అధికారులు సీజ్ చేయగా.. ఆ ప్రయాణికుడిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాచీల మొత్తం విలువ 28,17,97,864రూపాయలు అంటుందని అధికారులు తెలిపారు. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (APIS) ప్రొఫైలింగ్ సహాయంతో అధికారులు స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని పట్టున్నారు.
రికవరీ చేయబడిన వస్తువులు కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 ప్రకారం సీజ్ చేయబడ్డాయి. ప్రయాణీకుడిపై కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104, కస్టమ్స్ చట్టం 135 కింద నాన్ బెయిలబుల్ కేసును అధికారులు పెట్టారు
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!