Crime Job : రోజుకు రూ.1000 జీతం… కానీ పని దొంగతనాలే.!
- రోజుకు వెయ్యి రూపాయలు జీతం
- దొంగతనాలు చేయిస్తున్న గ్యాంగ్ లీడర్
- పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి
పనీపాట లేక.. అవారాగా తిరుగుతున్న పోకిరీలకు ఉద్యోగాలు ఇస్తున్నాడో వ్యక్తి ! అలా అని అతడ్ని మహానుభావుడు అనుకునేరు !! పెద్ద కంత్రీ ఫెలో. అతడు ఇచ్చే ఉద్యోగం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిత్యం రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ సెల్ఫోన్లు దొంగిలించి తీసుకురావాలి. ఇందుకు మూడు పూటలా తిండి పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాడు. ఉండటానికి షెల్టర్ ఇస్తాడు. ఎక్కువ ఫోన్లు దొంగిలించిన వాడికి బోనస్లు కూడా ఇస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ దొంగల ముఠా ఆటకట్టించారు పోలీసులు. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తూ… భోజనం పెడుతూ… దొంగతనాలు చేయిస్తున్నాడో గ్యాంగ్ లీడర్. వీళ్లు చేయాల్సిందల్లా ఒకటే..!! పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి. ఒంటరిగా ఉన్న వారినో, బిజీగా ఉన్న వారినో టార్గెట్ చేసి.. సెల్ ఫోన్లు చోరీ చేయాలి. తీసుకొచ్చి గ్యాంగ్ లీడర్కి ఇవ్వాలి. ఇలాంటి కంత్రీ దొంగల ముఠా గుట్టురట్టు చేశారు మెహిదీపట్నం పోలీసులు..
UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్తో అంతా షాక్..
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
వెస్ట్బెంగాల్కి చెందిన సాగర్ కుమార్ నోనియా మెహిదీపట్నంలో ఉంటున్నాడు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి పనుల కోసం హైదరాబాద్ వచ్చిన యువకులను తన వద్ద పనిలో చేర్చుకుంటున్నాడు. నెలంతా కష్టపడినా మీరేం సంపాదించలేరని.. తాను చెప్పిన పని చేస్తే లక్షలు సంపాదించొచ్చు అని మాయమాటలు చెప్పి.. దొంగలుగా మార్చుతున్నాడు. ఉండటానికి షెల్టర్ ఇచ్చి.. మూడు పూటల భోజనం పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఈ యువకులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో టీ అమ్ముతున్నట్టు నటిస్తూ.. లేదా ప్రయాణికులుగా నటిస్తూ.. సెల్ఫోన్లు దొంగిలిస్తారు. రోజంతా దొంగిలించిన ఫోన్లను సాయంత్రానికి తమ లీడర్ సాగర్ కుమార్ నోనియాకు అప్పగిస్తారు. వాటిని సాగర్ కుమార్ దొంగ మార్కెట్లో అమ్ముకుంటాడు..
వరుస సెల్ఫోన్ స్నాచింగ్లపై నజర్ పెట్టిన మెహిదీపట్నం పోలీసులు.. ఈ ముఠాను పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్కి చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, జార్ఖండ్కి చెందిన పరణ్ కుమార్, దేవా కుమార్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే 21 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పెంచి పోషిస్తున్న గ్యాంగ్ లీడర్ సాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు..
Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!
తాజావార్తలు
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!