Crime Job : రోజుకు రూ.1000 జీతం… కానీ పని దొంగతనాలే.!
- రోజుకు వెయ్యి రూపాయలు జీతం
- దొంగతనాలు చేయిస్తున్న గ్యాంగ్ లీడర్
- పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పనీపాట లేక.. అవారాగా తిరుగుతున్న పోకిరీలకు ఉద్యోగాలు ఇస్తున్నాడో వ్యక్తి ! అలా అని అతడ్ని మహానుభావుడు అనుకునేరు !! పెద్ద కంత్రీ ఫెలో. అతడు ఇచ్చే ఉద్యోగం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిత్యం రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ సెల్ఫోన్లు దొంగిలించి తీసుకురావాలి. ఇందుకు మూడు పూటలా తిండి పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాడు. ఉండటానికి షెల్టర్ ఇస్తాడు. ఎక్కువ ఫోన్లు దొంగిలించిన వాడికి బోనస్లు కూడా ఇస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ దొంగల ముఠా ఆటకట్టించారు పోలీసులు. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తూ… భోజనం పెడుతూ… దొంగతనాలు చేయిస్తున్నాడో గ్యాంగ్ లీడర్. వీళ్లు చేయాల్సిందల్లా ఒకటే..!! పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి. ఒంటరిగా ఉన్న వారినో, బిజీగా ఉన్న వారినో టార్గెట్ చేసి.. సెల్ ఫోన్లు చోరీ చేయాలి. తీసుకొచ్చి గ్యాంగ్ లీడర్కి ఇవ్వాలి. ఇలాంటి కంత్రీ దొంగల ముఠా గుట్టురట్టు చేశారు మెహిదీపట్నం పోలీసులు..
UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్తో అంతా షాక్..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
వెస్ట్బెంగాల్కి చెందిన సాగర్ కుమార్ నోనియా మెహిదీపట్నంలో ఉంటున్నాడు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి పనుల కోసం హైదరాబాద్ వచ్చిన యువకులను తన వద్ద పనిలో చేర్చుకుంటున్నాడు. నెలంతా కష్టపడినా మీరేం సంపాదించలేరని.. తాను చెప్పిన పని చేస్తే లక్షలు సంపాదించొచ్చు అని మాయమాటలు చెప్పి.. దొంగలుగా మార్చుతున్నాడు. ఉండటానికి షెల్టర్ ఇచ్చి.. మూడు పూటల భోజనం పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఈ యువకులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో టీ అమ్ముతున్నట్టు నటిస్తూ.. లేదా ప్రయాణికులుగా నటిస్తూ.. సెల్ఫోన్లు దొంగిలిస్తారు. రోజంతా దొంగిలించిన ఫోన్లను సాయంత్రానికి తమ లీడర్ సాగర్ కుమార్ నోనియాకు అప్పగిస్తారు. వాటిని సాగర్ కుమార్ దొంగ మార్కెట్లో అమ్ముకుంటాడు..
వరుస సెల్ఫోన్ స్నాచింగ్లపై నజర్ పెట్టిన మెహిదీపట్నం పోలీసులు.. ఈ ముఠాను పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్కి చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, జార్ఖండ్కి చెందిన పరణ్ కుమార్, దేవా కుమార్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే 21 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పెంచి పోషిస్తున్న గ్యాంగ్ లీడర్ సాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు..
Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!
తాజావార్తలు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!