West Bengal: బెంగాల్లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..
- బెంగాల్లో మరో వైద్య విద్యార్థిపై అత్యాచారం..
- క్యాంపస్ సమీపంలోనే దారుణం..
- పానీపూరీ కోసం బయటకు వచ్చిన సమయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన బాధితురాలు, పశ్చిమ బెంగాల్ లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతోంది. ఇది రాజధాని కోల్కతా నుంచి 170 కి.మీ దూరంలో ఉంది.
శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విద్యార్థిని తన బాయ్ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ బయటకు వచ్చింది. క్యాంపస్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఆమెను ఆస్పత్రి వెనక ఉన్న నిర్జన ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపారు. కాలేజ్ సిబ్బందితో పాటు మహిళతో ఉన్న ఆమె ఫ్రెండ్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
Read Also: Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..
ఈ సంఘటన గురించి తన కుమార్తె స్నేహితుడు తనకు తెలియజేశాడని విద్యార్థిని తండ్రి విలేకరులకు తెలిపారు. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నా కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. తన కుమార్తె పానీపూరీ తినడానికి క్యాంపస్ బయటకు వచ్చింది., ఆమె ప్రియుడు వాసిఫ్ అలీ తనను కలవడానికి పిలిచాడని ఆయన చెప్పారు.
ఆమె క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత, బయట నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారని, ఇందులో ఒకడు ఆమెను ఈడ్చుకెళ్లి, అత్యాచారాని పాల్పడినట్లు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి రూ. 3000 డిమాండ్ చేశాడని చెప్పాడు. తన కుమార్తెకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మరే అమ్మాయికి జరగొద్దని ఆయన కోరారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?