West Bengal: బెంగాల్లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..
- బెంగాల్లో మరో వైద్య విద్యార్థిపై అత్యాచారం..
- క్యాంపస్ సమీపంలోనే దారుణం..
- పానీపూరీ కోసం బయటకు వచ్చిన సమయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన బాధితురాలు, పశ్చిమ బెంగాల్ లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతోంది. ఇది రాజధాని కోల్కతా నుంచి 170 కి.మీ దూరంలో ఉంది.
శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విద్యార్థిని తన బాయ్ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ బయటకు వచ్చింది. క్యాంపస్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఆమెను ఆస్పత్రి వెనక ఉన్న నిర్జన ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపారు. కాలేజ్ సిబ్బందితో పాటు మహిళతో ఉన్న ఆమె ఫ్రెండ్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
Read Also: Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..
ఈ సంఘటన గురించి తన కుమార్తె స్నేహితుడు తనకు తెలియజేశాడని విద్యార్థిని తండ్రి విలేకరులకు తెలిపారు. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నా కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. తన కుమార్తె పానీపూరీ తినడానికి క్యాంపస్ బయటకు వచ్చింది., ఆమె ప్రియుడు వాసిఫ్ అలీ తనను కలవడానికి పిలిచాడని ఆయన చెప్పారు.
ఆమె క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత, బయట నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారని, ఇందులో ఒకడు ఆమెను ఈడ్చుకెళ్లి, అత్యాచారాని పాల్పడినట్లు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి రూ. 3000 డిమాండ్ చేశాడని చెప్పాడు. తన కుమార్తెకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మరే అమ్మాయికి జరగొద్దని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!