Doctor Suicide: ‘‘పోలీస్ నన్ను 4 సార్లు రేప్ చేశాడు’’.. సంచలనంగా మారిన వైద్యురాలి ఆత్మహత్య..
- మహారాష్ట్రలో సంచలనంగా వైద్యురాలి ఆత్మహత్య..
- అరచేతిపై సూసైడ్ నోట్..
- ఎస్ఐ తనపై అత్యాచారం చేశాడని ఆరోపణ..
Doctor Suicide: మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్(ఎస్ఐ) అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు తన ఎడమ చేతిపై సూసైడ్ నోట్ రాసి, దారుణానికి ఒడిగట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఎస్ఐ బడ్నేను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read Also: Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
Also Read
- Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
“పోలీస్ ఇన్స్పెక్టర్ గోపాల్ బడ్నే నా మరణానికి కారణం. అతను నన్ను నాలుగుసార్లు అత్యాచారం చేశాడు. అతను ఐదు నెలలకు పైగా నన్ను అత్యాచారం, మానసికంగా మరియు శారీరకంగా హింసించాడు” అని నోట్లో పేర్కొంది. ఫల్తాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న బాధితురాలు, జూన్ 19న ఇదే ఆరోపణలతో డీఎస్పీకి లేఖ రాసింది. ఆమె ఆత్మహత్యకు నెలల ముందు డీఎస్పీకి రాసిన లేఖలో.. రూరల్ పోలీస్ విభాగానికి చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు తనను వేధించారని ఆరోపించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె లేఖలో బడ్నే, సబ్-డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ లాడ్పుత్రేల పేర్లను పేర్కొంది. తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని, ఈ విషయాన్ని దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు బడ్నేను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ లీడర్ విజయ్ నామ్దేవ్రావ్ వాడేట్టివార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో వైద్యురాలు ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహాయుతి ప్రభుత్వం పదేపదే పోలీసుల్ని కాపాడుతోందని, ఇది పోలీస్ దురాగతాలకు కారణమవుతోందని ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం వైద్యురాలి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
-
Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!
-
West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
-
PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!