Doctor Suicide: ‘‘పోలీస్ నన్ను 4 సార్లు రేప్ చేశాడు’’.. సంచలనంగా మారిన వైద్యురాలి ఆత్మహత్య..
- మహారాష్ట్రలో సంచలనంగా వైద్యురాలి ఆత్మహత్య..
- అరచేతిపై సూసైడ్ నోట్..
- ఎస్ఐ తనపై అత్యాచారం చేశాడని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor Suicide: మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్(ఎస్ఐ) అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు తన ఎడమ చేతిపై సూసైడ్ నోట్ రాసి, దారుణానికి ఒడిగట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఎస్ఐ బడ్నేను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read Also: Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
Also Read
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
“పోలీస్ ఇన్స్పెక్టర్ గోపాల్ బడ్నే నా మరణానికి కారణం. అతను నన్ను నాలుగుసార్లు అత్యాచారం చేశాడు. అతను ఐదు నెలలకు పైగా నన్ను అత్యాచారం, మానసికంగా మరియు శారీరకంగా హింసించాడు” అని నోట్లో పేర్కొంది. ఫల్తాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న బాధితురాలు, జూన్ 19న ఇదే ఆరోపణలతో డీఎస్పీకి లేఖ రాసింది. ఆమె ఆత్మహత్యకు నెలల ముందు డీఎస్పీకి రాసిన లేఖలో.. రూరల్ పోలీస్ విభాగానికి చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు తనను వేధించారని ఆరోపించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె లేఖలో బడ్నే, సబ్-డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ లాడ్పుత్రేల పేర్లను పేర్కొంది. తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని, ఈ విషయాన్ని దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు బడ్నేను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ లీడర్ విజయ్ నామ్దేవ్రావ్ వాడేట్టివార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో వైద్యురాలు ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహాయుతి ప్రభుత్వం పదేపదే పోలీసుల్ని కాపాడుతోందని, ఇది పోలీస్ దురాగతాలకు కారణమవుతోందని ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం వైద్యురాలి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Jana Nayagan: ఆ రెండు డేట్స్ లోనే ‘జన నాయగన్’.?
-
Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!
-
OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్?
-
UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో