NTV Telugu Site icon

Madhyapradesh : దారుణం..స్కూటీని ఢీ కొట్టిన కారు..ఎనిమిదేళ్ల చిన్నారి మృతి..

Maharastra Accident

Maharastra Accident

ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము.. అలాగే మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కూడా కష్టమే.. రోడ్డు ప్రమాదాల పై ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను తీసుకున్నా కూడా ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. రోడ్డుపై నిలబడి ఉన్న స్కూటీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ స్కూటీని కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ స్కూటీపై తన తల్లిదండ్రులతో పాటు ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది..

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రమాదం జరిగి పది రోజులు దాటినా.. పోలీసులు నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు… ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కథనం ద్వారా ఈ ఘటన వెలుగు చూసింది.. రోడ్డు పక్కన పార్క్ చేసిన యాక్టివాను కారు ఈడ్చుకెళ్లింది. మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాకు చెందిన విక్రమ్ సింగ్ తన భార్య, ఎనిమిదేళ్ల కుమర్తె అథర్వతో కలిసి ఇటీవల పాత కంటోన్మెంట్ గ్వాలియర్ లో ఉన్న ఇంటికి వచ్చాడు. అయితే ఆయన తిరిగి తన ఇంటికి వెళ్తున్నాడు..

అయితే, ఆ సమయంలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన స్కూటీని ఆపాడు. అయితే కొంత సమయంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆ స్కూటీని ఢీకొట్టింది. అనంతరం కొంత దూరంగా ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానికులు హాస్పిటల్ లో చేర్చారు. అథర్వకు తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చేర్చారు.. కానీ పరిస్థితి విషమించడంతో చిన్నారి మరణించింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..