Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు
- యువతిని హత్య చేసి సమాధిపై మంచం వేసుకుని ..
- రెండు రాత్రులు పడుకున్న యువకుడు
- యువకుడి వింత ప్రవర్తనతో
- ఆశ్చర్యపోయిన స్థానికులు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో ఓ యువకుడు మహిళను చంపి రెండ్రోజులు సమాధి పైనే పడుకున్నాడు. యువకుడి వింత ప్రవర్తన పోలీసులు, స్థానికులు విస్తు పోయేలా చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also:shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ…
Also Read
పూర్త వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 02న నివారి జిల్లాలో ఓర్ఛా పోలీస్ స్టేషన్ సమీపంలో తన ప్రియురాలిని హత్య చేసి.. సమాధి దగ్గరే రెండు రోజులు పడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడి రతిరాం రాజ్ పుత్ రీసెంట్ గా పెళ్లైన తన ప్రేయసిని ముందు రోజు రాత్రి తన ఇంటికి రమ్మన్నాడు. ఇద్దరు ఎంజాయ్ చేసిన అనంతరం ఆమె మెడకు టవల్ చుట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ముకేష్, జ్ఞాన్ సింగ్ తో కలిసి శవాన్ని పాతి పెట్టాడు. సమాధిని బురద, ఆవు పేడతో నింపేశాడు. అనంతరం సమాధిపై మంచం వేసుకుని రెండు రాత్రులు అక్కడే పడుకున్నాడు.
యువతి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో రతిరాం అనే యువకుడితో యువతి సన్నిహితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రతిరాం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. యువతి.. తన భర్తను వదిలేసి వచ్చేస్తానని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా గత కొంత కాలంగా రతిరాం పై ఒత్తిడి పెడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెతో సంబంధాన్ని కొనసాగించలేక.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.
Read Also:UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు
యువతిని బ్లేడుతో కోసి, కరెంటు షాకిచ్చి, మెడకు ఉరి బిగించి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ అరెస్టైన రెండు రోజులకే నిందితుడు రతిరాం బయటకు వచ్చాడు. బాధితులు ఫిర్యాదుతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పరారీలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రతిరాంను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!