NTV Telugu Site icon

Karnataka: టీనేజ్ బాలికపై అత్యాచారం.. గర్భంతో ఉన్నానని తెలిసి సూసైడ్..

Suicide

Suicide

Karnataka: అత్యాచారానికి గురైన టీనేజ్ బాలిక, తాను గర్భం దాల్చానని తెలుసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలిక గర్భవతి అని తెలియగానే ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో లైంగిక వేధింపులకు గురైనట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు బాలిక ఇంటి పొరుగున ఉండే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

Read Also: Iran: ఇరాన్-పాకిస్తాన్ బోర్డర్‌లో టెన్షన్.. 9 మంది విదేశీయుల కాల్చివేత..

అత్యాచారానికి గురైనప్పటి నుంచి తన బిడ్డ మానసిక వేదనతో ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ఓ బిడ్డకు తల్లవుతున్నానని తెలుసుకుని కుమిలిపోయేదని, ఈ నేపథ్యంలోనే జనవరి 24న ఉరేసుకుని చనిపోయిందని వారు చెప్పారు. ఈ ఆత్మహత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు మాండ్య ఎస్పీ యతీష్ చెప్పారు. తనపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని బాలిక పోలీసులకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. ఈ ఆత్మహత్య అనంతరం పోలీసులు పోక్సో( లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేశారు.