Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?
- కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో దారుణం..
- కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో హత్య..
- కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కులాంతర ప్రేమలు పెను విషాదాలను మిగులుస్తున్న సంఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో గల మెలకుంద గ్రామంలో జరిగిన ఇలాంటి ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి, ఆమెను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారాణ జరిపి, అసలు నిజాన్ని బయటపెట్టారు.
Read Also: Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
తీరు మార్చుకోని కూతురు..
అయితే, మెలకుంద గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్న కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కులాంతర వివాహం జరిగితే మిగతా కుమార్తెల పెళ్లిళ్లు ఆగిపోతాయన్న భయం అతడ్ని వెంటాడింది. దీంతో కూతురిని ఒప్పించేందుకు బంధువుల సహాయం తీసుకున్నప్పటికీ, ఆమె తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.
Read Also: Russia: రష్యా గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ..
ఇక, గురువారం నాడు తన కూతురిని గొంతు నులిమి చంపిన శంకర్, ఆ తర్వాత ఆమె నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. గ్రామస్థులు కూడా అది ఆత్మహత్యే అని భావించి అంత్యక్రియలను కూడా నిర్వహించారు. కానీ, ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో, కలబుర్గి పోలీసు కమిషనర్ శరణప్ప ఎస్డీ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.
Read Also: Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
బయటపడ్డ నిజం:
కాగా, మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఇది హత్యేనని నిర్ధారించింది. దీంతో పోలీసులు మృతురాలి తండ్రి శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కులాంతర వివాహం కారణంగా తన కుటుంబ పరువు పోతుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డానని శంకర్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు హత్య, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసుల్లో అరెస్టు చేశారు. ఈ ఘటనలో శంకర్ బంధువులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, వారు దోషులని తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని కలబుర్గి కమిషనర్ శరణప్ప ఎస్డీ తెలిపారు.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!