Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని జుబ్లీహిల్స్ పోలీసులు నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఒక భారీ విదేశీ ఉద్యోగాల ముఠా గుట్టును రట్టు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న “ట్రివియల్ చాప్టర్” అనే సంస్థపై ఉక్కుపాదం మోపిన పోలీసులు, ఆ సంస్థకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. విదేశాలకు వెళ్లి లక్షల్లో సంపాదించాలనే కోరికతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ముఖ్యంగా గ్రీస్, రొమేనియా, ఇటలీ మరియు సెర్బియా వంటి దేశాల్లో వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను వేదికగా చేసుకుని ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించారు.
ఈ కేటుగాళ్లు ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి, నమ్మకం కలిగించడానికి ఆన్లైన్ టెంప్లేట్ల ద్వారా సృష్టించిన నకిలీ ఆఫర్ లెటర్లు , ‘వర్క్ ఆథరైజేషన్’ పత్రాలను అందజేశారు. ఒకసారి డబ్బు చేతికి అందాక బాధితుల ఫోన్ కాల్స్ ఎత్తకుండా, కనీసం సందేశాలకు కూడా సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసేవారు. విచారణలో ఈ సంస్థకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అధికారిక రిక్రూట్మెంట్ ఏజెంట్ లైసెన్స్ లేదని తేలింది.
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
𝗝𝘂𝗯𝗶𝗹𝗲𝗲 𝗛𝗶𝗹𝗹𝘀 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗕𝘂𝘀𝘁 𝗢𝘃𝗲𝗿𝘀𝗲𝗮𝘀 𝗝𝗼𝗯 𝗥𝗮𝗰𝗸𝗲𝘁; 𝗧𝘄𝗼 𝗞𝗲𝘆 𝗠𝗲𝗺𝗯𝗲𝗿𝘀 𝗼𝗳 ‘𝗧𝗿𝗶𝘃𝗶𝗮𝗹 𝗖𝗵𝗮𝗽𝘁𝗲𝗿’ 𝗔𝗿𝗿𝗲𝘀𝘁𝗲𝗱
HYDERABAD | April 14, 2026: The Jubilee Hills Police have successfully dismantled a fraudulent gang operating… pic.twitter.com/4f6oqQO8EB
— Hyderabad City Police (@hydcitypolice) April 14, 2026
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న పోలీసులు దాడి చేసి సంస్థ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ, రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సంస్థ సీఈఓ, వ్యవస్థాపకుడు సహా మరో ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో కేపీహెచ్బీ స్టేషన్ పరిధిలోనూ ఈ సంస్థ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కేవలం అధికారిక ‘ఈ-మైగ్రేట్’ పోర్టల్ ద్వారానే ఏజెంట్ల వివరాలు సరిచూసుకోవాలని, అనధికార సంస్థలకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!