Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’ సినిమాలో ఒక సీన్ గుర్తుందా..? ప్రకాష్ రాజ్ మారువేషంలో వెళ్లి మందు అమ్ముతున్న దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. సరిగ్గా అదే తరహాలో.. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి వేళ ఒంటరి మహిళగా రోడ్డుపై నిలబడి పోకిరీల ఆటకట్టించారు. ఏసీ గదుల్లో కూర్చుని నివేదికలు చదవడం కంటే.. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె చేసిన ఈ సాహసం అభినందనీయం. పోకిరీల ఆగడాలను అరికట్టాలంటే ఇలాంటి వినూత్న ప్రయోగాలు ఎంతో అవసరం. పోలీసులంటే భయం లేని వారికి ఇదొక గట్టి హెచ్చరిక.
హైదరాబాద్ నగరంలో మహిళల రక్షణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి మల్కాజిగిరి సీపీ సుమతి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పోలీస్ భద్రత లేకుండా.. సామాన్య మహిళలా వేషం మార్చుకుని అర్ధరాత్రి 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు బస్టాప్ వద్ద ఒంటరిగా వేచి చూశారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
కేవలం మూడు గంటల వ్యవధిలో దాదాపు 40 మంది పురుషులు ఆమెను సమీపించారు. వీరిలో ఎక్కువమంది మద్యం మత్తులో ఉండగా, మరికొందరు గంజాయి సేవించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ఒంటరిగా ఉన్న మహిళను చూసి వస్తావా..? రేటు ఎంత అంటూ అసభ్యంగా ప్రవర్తించడం నగరంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించింది. ఎదురుగా ఉన్నది ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అని తెలియక వారు చేసిన ఆగడాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.
ఈ ఆపరేషన్ తర్వాత పోలీసులు సదరు వ్యక్తులను గుర్తించారు. అయితే వెంటనే కేసులు నమోదు చేయకుండా, వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి, బహిరంగ ప్రదేశాల్లో మర్యాదగా ఎలా ఉండాలి అనే విషయాలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సుమతి ఇలాంటి ప్రయోగాలు కొత్తేమీ కాదు. 25 ఏళ్ల క్రితం కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో డీఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఆమె ఇలాగే మారువేషంలో వెళ్లి మహిళల రక్షణను పర్యవేక్షించారు. గతంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్గా పనిచేసిన ఆమె, మావోయిస్టుల లొంగుబాటులో కూడా కీలక పాత్ర పోషించారు. సీపీ సుమతి ఈ తెగువను చూసి నగరవాసులు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే స్వయంగా రంగంలోకి దిగితేనే క్షేత్రస్థాయి సమస్యలు తెలుస్తాయని ఈ ఘటన నిరూపించింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!